News February 11, 2025

మహబూబాబాద్: సమ్మక్క సారలమ్మ మినీ జాతరకు స్పెషల్ బస్సు

image

మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మినీ జాతర పురస్కరించుకొని మహబూబాబాద్ డిపో నుంచి ఉ.8 గ.లకు జాతర స్పెషల్ బస్సును ప్రారంభిస్తున్నామని డిపో మేనేజర్ శివప్రసాద్ ప్రకటనలో తెలిపారు. బస్సు ఉదయం 08:00 గంటలకు మహబూబాబాద్ నుంచి బయలుదేరి 12:00 pm మేడారం చేరుకొని, మళ్లీ సాయంత్రం 5:00 గంటలకు మేడారం నుంచి బయలుదేరి రాత్రి 9 గంటలకు మహబూబాబాద్ చేరుకుంటుందని మేనేజర్ పేర్కొన్నారు. ప్రయాణికులు వినియోగించుకోవాలని కోరారు.

Similar News

News December 4, 2025

తెలుగు చదువుకుంటేనే ఉద్యోగం.. వెంకయ్య కీలక వ్యాఖ్యలు

image

AP: తాను చదువుకునే రోజుల్లో అవగాహన లేక హిందీ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నానని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య చెప్పారు. మాతృభాషకు ప్రాధాన్యం ఇచ్చి, ఆ తర్వాత సోదర భాషలు నేర్చుకోవాలని పిలుపునిచ్చారు. మచిలీపట్నం కృష్ణా వర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘AP, TGలు తెలుగును పరిపాలనా భాషగా చేసుకోవాలి. తెలుగు చదువుకుంటేనే ఉద్యోగం ఇస్తామని చెప్పాలి. అప్పుడే తెలుగు వెలుగుతుంది’ అని పేర్కొన్నారు.

News December 4, 2025

సంగారెడ్డి: ‘మూడుసార్లు లెక్కలు చూపించాలి’

image

రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు మూడుసార్లు తమ లెక్కలను వ్యయ అధికారులకు చూపించాలని జిల్లా పరిశీలకులు రాకేష్ గురువారం తెలిపారు. 8, 10, 12 తేదీల్లో ఎంపీడీవో కార్యాలయంలో వ్యాయ పరిశీలన చేయించుకోవాలని చెప్పారు. వ్యాయ పరిశీల చేసుకొని అభ్యర్థులకు ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

News December 4, 2025

KNR: పంచాయతీ ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్

image

పంచాయతీ ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన ఎన్నికల సంఘం కమిషనర్ జిల్లాలలో పంచాయతీ ఎన్నికలను నిబంధన ప్రకారం నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ.రాణి కుముదిని అన్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ.రాణి కుముదిని కలెక్టర్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. తదితర అంశాల పట్ల ఎన్నికల కమిషనర్ రివ్యూ నిర్వహించారు.