News January 9, 2025
మహబూబాబాద్: ABSF ఆధ్వర్యంలో షేక్ ఫాతిమా జయంతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1736404567595_50311560-normal-WIFI.webp)
మహబూబాబాద్లో మొదటి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలు షేక్ ఫాతిమా జయంతి వేడుక నిర్వహించారు. అఖిల భారత స్టూడెంట్ ఫెడరేషన్ (ABSF) రాష్ట్ర అధ్యక్షుడు ఇనుగుర్తి సుధాకర్ ఆధ్వర్యంలో ఫాతిమా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ ప్రభుత్వం ఫాతిమా జయంతిని అధికారింగా ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సంజీవరావు, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.
Similar News
News January 13, 2025
భక్తులతో కిక్కిరిసిన కొమురవెల్లి మల్లన్న
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1736752226654_60457995-normal-WIFI.webp)
కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి ఆదివారం భక్తులు భారులు తీరారు. జనవరి 19న పట్నం వారం (మొదటి వారం)తో కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు మొదలు కానున్నాయి. ఈ తరుణంలో ఆలయానికి భక్తుల రద్దీ భారీగా పెరిగిందని ఆలయ వర్గం వెల్లడించింది. ఈఓ రామాంజనేయులు, ఏఈఓ శ్రీనివాస్, ఆలయ పర్యవేక్షకులు శ్రీరాములు, సురేందర్, ప్రధానార్చకులు మహాదేవుని మల్లికార్జున, తదితరులు భక్తులకు సేవలందించారు.
News January 13, 2025
భోగి స్పెషల్.. భద్రకాళి అమ్మవారి దర్శనం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1736733914285_18102126-normal-WIFI.webp)
వరంగల్ నగరంలోని భద్రకాళి అమ్మవారికి అర్చకులు ఈరోజు ప్రత్యేక అలంకరణ చేపట్టారు. నేడు భోగి పర్వదినం, సోమవారం సందర్భంగా అర్చకులు అమ్మవారు నిజరూప దర్శనంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. కాగా, సంక్రాంతి సెలవులు రావడంతో ఉదయం నుంచే భక్తులు ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకుని పూజలు చేస్తున్నారు.
News January 13, 2025
వరంగల్: ఘోరం.. మూడేళ్ల బాలుడి మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1736734117322_1072-normal-WIFI.webp)
నీటి సంపుటిలో పడి మూడేళ్ల బాలుడు మృతిచెందాడు. వరంగల్(D) సంగెం (M) ఆశాలపల్లిలో జరిగింది. పోలీసుల ప్రకారం.. కొండపర్తికి చెందిన రాజు-స్రవంతి పండుగకు ఆశాలపల్లికి వచ్చారు. నిన్న రివాన్స్(3) ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. కొద్ది సమయం తర్వాత కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వేతకగా నీటి సంపుటిలో పడి కనిపించాడు. MGMకి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.