News March 20, 2025

మహబూబ్‌నగర్‌లో కానిస్టేబుల్ సూసైడ్

image

మహబూబ్‌నగర్‌లో ఏఆర్ కానిస్టేబుల్ సూసైడ్ చేసుకున్నారు. సీఐ అప్పయ్య తెలిపిన వివరాలిలా.. స్థానిక గౌడ్స్ కాలనీలో నివాసముంటున్న 2009 బ్యాచ్ కానిస్టేబుల్ ఆకుల శ్రీనివాస్(38) ఏడాది క్రితం రోడ్డు ప్రమాదానికి గురికావడంతో ఆర్థిక, అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో కొన్ని రోజులుగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఆయన మంగళవారం అర్ధరాత్రి ఇంట్లో ఉరేసుకున్నాడు. మృతుడి భార్య మమత ఫిర్యాదుతో కేసు నమోదైంది.

Similar News

News November 22, 2025

ఖైరతాబాద్‌ ఉప ఎన్నిక అనివార్యమేనా?

image

ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఖాయమయ్యేలా కనిపిస్తోంది. ఇప్పటికే MLA దానం నాగేందర్ AICC పెద్దలతో సమావేశమయ్యారు. అనర్హత అనివార్యమైతే పదవి వదులుకోవాల్సిందే. రాజీనామా చేస్తే MLA టికెట్ తనకే ఇవ్వాలని ఆయన AICCని కోరినట్లు సమాచారం. మరోవైపు కాంగ్రెస్‌ టికెట్ కోసం ఆశావహులు ముందుకొస్తున్నారు. 30 ఏళ్లుగా పార్టీ కోసం పని చేశానని ఖైరతాబాద్ సీనియర్ లీడర్ రాజు యాదవ్ టికెట్ తనకే ఇవ్వాలని సెంటర్‌లో బ్యానర్ కూడా పెట్టేశారు.

News November 22, 2025

మద్నూర్: బెడిసికొట్టిన ఇసుక స్మగ్లర్ల ‘కొత్త ప్లాన్’.. ఆరుగురి అరెస్ట్

image

మహారాష్ట్రకు ఇసుక అక్రమ రవాణా చేసేందుకు ప్రయత్నించిన ఆరుగురిని మద్నూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఇసుక అక్రమ రవాణాకు ఆటకం కలగకుండా ఉండేందుకు చెక్ పోస్టులను దాటించేందుకు కొత్త తరహాలో ప్రయత్నించారు. అక్రమ రవాణాకు పాల్పడుతున్న 2 టిప్పర్ డ్రైవర్లు, 4 పైలట్ కార్ల యజమానులతో సహా మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. 2 టిప్పర్లు, 2 కార్లను స్వాధీనం చేసుకుని, వారిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

News November 22, 2025

వందల మందిని కాపాడే ఏఐ పరికరం.. అభినందించాల్సిందే!

image

హిమాచల్ ప్రదేశ్‌లో కొండ చరియలు విరిగిపడటం వల్ల ఎంతో మంది చనిపోతుంటారు. అలాంటి ప్రమాద మరణాలను తగ్గించేందుకు IIT మండికి చెందిన డా.కళా వెంకట ఉదయ్ టీమ్ అతి తక్కువ ఖర్చుతో AI వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఇది 90% పైగా కచ్చితత్వంతో 3 గంటల ముందుగానే కొండచరియలు విరిగిపడే ప్రమాదాన్ని అంచనా వేస్తుంది. దీని సెన్సార్లు భూమి కదలిక, వాతావరణ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించి ప్రమాదానికి ముందు అలర్ట్ చేస్తుంది.