News March 20, 2025
మహబూబ్నగర్లో కానిస్టేబుల్ సూసైడ్

మహబూబ్నగర్లో ఏఆర్ కానిస్టేబుల్ సూసైడ్ చేసుకున్నారు. సీఐ అప్పయ్య తెలిపిన వివరాలిలా.. స్థానిక గౌడ్స్ కాలనీలో నివాసముంటున్న 2009 బ్యాచ్ కానిస్టేబుల్ ఆకుల శ్రీనివాస్(38) ఏడాది క్రితం రోడ్డు ప్రమాదానికి గురికావడంతో ఆర్థిక, అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో కొన్ని రోజులుగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఆయన మంగళవారం అర్ధరాత్రి ఇంట్లో ఉరేసుకున్నాడు. మృతుడి భార్య మమత ఫిర్యాదుతో కేసు నమోదైంది.
Similar News
News March 28, 2025
కొలికపూడి వ్యవహారంపై నివేదిక కోరిన టీడీపీ

AP: ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తీరుపై TDP అధిష్ఠానం ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. అందరినీ కలుపుకుని వెళ్లాలని చెప్పినా ఆయనలో మార్పురాలేదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 10 నెలలుగా తిరువూరులో జరిగిన ఘటనలపై నివేదిక ఇవ్వాలని జిల్లా అధ్యక్షుడు, సమన్వయకర్త, ఎంపీని ఆదేశించింది. తాజాగా టీడీపీ నేత రమేశ్ రెడ్డిపై అధిష్ఠానం చర్యలు తీసుకోకపోతే రాజీనామా చేస్తానని కొలికపూడి <<15904325>>హెచ్చరించిన<<>> విషయం తెలిసిందే.
News March 28, 2025
బంగారు కవచాలతో భద్రాద్రి రామయ్య దర్శనం

భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారు శుక్రవారం సందర్భంగా బంగారు కవచాలతో భక్తులకు దర్శనమిచ్చారు. ఉపాలయంలో వేంచేసి ఉన్న లక్ష్మీతాయారు అమ్మవారికి విశేషాలు నిర్వహించారు. సాయంత్రం స్వామివారికి బేడా మండపంలో సంధ్యా హారతులు, ఉత్సవాన్ని జరపనున్నారు. ఈ అభిషేకంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, తిలకించారు.
News March 28, 2025
మొగుళ్లపల్లి: ‘పది’ పరీక్షా కేంద్రాల తనిఖీ

మొగుళ్లపల్లి మండల కేంద్రంతో పాటు మొట్లపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న పదో తరగతి పరీక్షలను డీఈవో రాజేందర్ తనిఖీ చేసినట్లు ఎంఈఓ కుమారస్వామి తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో కాన్ఫరెన్స్లో పాల్గొని జిల్లాలోని అన్ని పరీక్ష కేంద్రాల సీఎస్ (చీఫ్ సూపరింటెండెంట్), డీఓ(డిపార్ట్మెంటల్ ఆఫీసర్)లతో మాట్లాడారు. అనంతరం ముల్కలపల్లి పాఠశాలను తనిఖీ చేసి పలు సూచనలు చేశారు.