News January 8, 2025
మహబూబ్నగర్లో తాత్కాలికంగా పలు రైళ్ల రద్దు

మహబూబ్నగర్ జిల్లాలో రైల్వే పనుల మరమ్మతుల కారణంగా పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఉమ్మడి జిల్లా మీదుగా సికింద్రాబాద్ – కర్నూల్ సిటీ తుంగభద్ర రైలు కర్నూలు – గద్వాల మధ్య పట్టాల మరమ్మతుల కారణంగా ఈ రైలు గద్వాల వరకు మాత్రమే నడవనుంది. కాచిగూడ – MBNR రైలు షాద్నగర్ వరకు మాత్రమే నడవనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రయాణికులు గమనించాలని కోరుతున్నారు.
Similar News
News December 29, 2025
FLASH: పాలమూరులో మరోసారి ఎన్నికలు

మహబూబ్ నగర్ జిల్లాలో మరోసారి ఎన్నిక సందడి నెలకొననుంది. జిల్లాలోని 3 మున్సిపాలిటీల్లో
కౌన్సిలర్లు పోలింగ్కు అధికారులు సిద్ధం అవ్వాలని ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం..
✒మహబూబ్ నగర్- 60 వార్డుల్లో 2,20,334 మంది జనాభా
✒దేవరకద్ర-12, వార్డుల్లో 12,269 మంది
✒భూత్పూర్-10 వార్డుల్లో 13,938 మంది
ఓటర్ల జాబితా అధికారులు సిద్ధం చేయనున్నారు.
News December 29, 2025
MBNR:T-20 టోర్నీ.. మన టీం షెడ్డుల్ ఇదే!

HCA ఆధ్వర్యంలో నిర్వహించిన జి.వెంకటస్వామి మెమోరియల్ “టీ-20 క్రికెట్ లీగ్” లో ఉమ్మడి మహబూబ్ నగర్ క్రికెట్ జట్టు పాల్గొంటుందని ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు.
✒ఈనెల 29న MBNR- కరీంనగర్
✒ఈ నెల 31న MBNR-HYD
✒Jan 3న MBNR- ఖమ్మం
✒Jan 5న MBNR-RR
✒Jan 6న MBNR- వరంగల్
✒Jan 8న MBNR- అదిలాబాద్
✒Jan 9న MBNR- నల్గొండ
✒Jan 13న MBNR- నిజామాబాద్
✒Jan 15న MBNR- మెదక్
News December 29, 2025
MBNR: ఆపరేషన్ స్మైల్-XII.. సమన్వయ సమావేశం

మహబూబ్ నగర్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎస్పీ డి జానకి ఆదేశాల మేరకు సోమవారం అదనపు ఎస్పీ ఎన్.బి.రత్నం అధ్యక్షతన ‘ఆపరేషన్ స్మైల్-XII’ నిర్వహణకు సంబంధించి సమన్వయ సమావేశం నిర్వహించారు. అదనపు ఎస్పీ ఎన్.బి. రత్నం మాట్లాడుతూ.. 2026 జనవరి 1 నుంచి జనవరి 31 వరకు జిల్లావ్యాప్తంగా ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.


