News May 19, 2024
మహబూబ్నగర్: ‘అంతటా అదే చర్చ!!’

ఉమ్మడి జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ముగియడంతో ఎక్కడికి వెళ్లినా ఫలితాలపై అందరూ చర్చించుకుంటున్నారు. ఉదయం వేళలో మైదానంలో రన్నింగ్ చేస్తున్న వారి దగ్గరి నుంచి సాయంత్రం టీ దుకాణాల దగ్గర ముచ్చట్లు పెట్టే వ్యక్తుల వరకు ప్రతి ఒక్కరు దీనిపైనే చర్చలు పెట్టారని స్థానికులు తెలిపారు. టీకొట్టు, హోటళ్లు, స్నాక్స్ దుకాణాలు, పని చేసే ప్రదేశాలు, వాకింగ్ మైదానాలు, ఎక్కడికి వెళ్లినా ఫలితాలపై చర్చలు నడుస్తున్నాయి.
Similar News
News December 18, 2025
MBNR: 19న “FSSAI లైసెన్స్,రిజిస్ట్రేషన్ మేళా”

మహబూబ్నగర్ జిల్లాలోని ఆహార వ్యాపార నిర్వాహకుల (ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లు) కోసం ఎఫ్ఎస్ఎస్ఏఐ(FSSAI) లైసెన్స్ ,రిజిస్ట్రేషన్ మేళా ఈనెల 19న నిర్వహించనున్నట్లు జిల్లా ఆహార తనిఖీ అధికారి నీలిమ తెలిపారు. ఈ మేళా మహబూబ్ నగర్ నందు ఇంటిగ్రేటెడ్ జిల్లా కార్యాలయ సముదాయం(IDOC) గది నెం.218లో ఉదయం 11.00 గంటల నుంచి నిర్వహించనున్నట్లు వెల్లడించారు. వివరాలకు 81212 59373, 70134 83730 నంబర్లకు సంప్రదించాలన్నారు.
News December 18, 2025
ఉమ్మడి జిల్లాలో ఈనాటి ముఖ్య వార్తలు

✒విశాఖ ఎక్స్ప్రెస్ను పొడిగించాలి:ఎంపీ డీకే అరుణ
✒MBNR: సర్పంచ్ ఎన్నికలు.. రూ.11,08,250 సీజ్:SP
✒సర్పంచుల మరణాలకు బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణం:MLA అనిరుధ్ రెడ్డి
✒MBNR: రేపు అంబులెన్స్ డ్రైవర్ల నియామకానికి ఇంటర్వ్యూలు
✒T-20 క్రికెట్ లీగ్.. జట్ల ఎంపికలు పూర్తి
✒పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్
✒పంచాయితీ పోరులో కాంగ్రెస్ హవా
✒MBNR: విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్
News December 18, 2025
MBNR: సర్పంచ్ ఎన్నికలు..70 నాఖాబందీ ఆపరేషన్లు

సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో భద్రతా చర్యల్లో భాగంగా 70 నాఖాబందీ ఆపరేషన్లు, 37 ఆయుధాల డిపాజిట్, 640 మందిని బైండ్ ఓవర్ చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. జిల్లావ్యాప్తంగా 3 చెక్పోస్టులు ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన పర్యవేక్షణ కొనసాగిందని, అలాగే రూ.7,200/- విలువగల ఉచితాల పంపిణీకి సంబంధించిన 1 కేసు, 3 ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కేసులు, 4 మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి.


