News April 3, 2025
మహబూబ్నగర్: ఉత్సవాలను ఘనంగా నిర్వహిద్దాం: కలెక్టర్

బాబు జగ్జీవన్ రామ్, డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి కోరారు. ఏప్రిల్ 5వ తేదీన జగ్జీవన్ రామ్, 14వ తేదీన అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని మహబూబ్నగర్ జిల్లా కలెక్టరేట్లో బుధవారం సంబంధిత సంఘాల ప్రతినిధులు అధికారులతో సమావేశం అయ్యారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో వెంకటరెడ్డి పాల్గొన్నారు.
Similar News
News April 11, 2025
ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక సరఫరా: కలెక్టర్

ఇందిరమ్మ ఇళ్లనిర్మాణానికి ఉచితంగా ఇసుకను సరఫరా చేయాలని మహబూబ్ నగర్ కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తహశీల్దార్లు, పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇందిరమ్మఇంటి నిర్మాణాలకు కావాల్సిన ఇసుకను లబ్ధిదారులకు సరఫరా చేసేందుకు పంచాయతీ కార్యదర్శి ధ్రువీకరించి తహశీల్దార్లకు పంపించాలన్నారు.
News April 11, 2025
ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS!

✔పలుచోట్ల ఈదురుగాలులతో వర్ష బీభత్సం
✔రేపు పూలే జయంతి వేడుకలు
✔నాగర్కర్నూల్: సిరసనగండ్ల రథోత్సవంలో లక్షల మంది
✔సళేశ్వరంలో ఆదివాసీ చెంచులే పూజారులు
✔KCR సభకు..BRS పార్టీ శ్రేణులకు పిలుపు
✔ఉమ్మడి జిల్లాల్లో జోరుగా వరి కోతలు
✔NGKL:చిన్నతగాదాతో భార్యాభర్తల సూసైడ్
✔IPL బెట్టింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు:ఎస్సైలు
✔పలుచోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం
News April 10, 2025
ఇక నుంచి మానవ డోనర్ మిల్క్: జిల్లా కలెక్టర్

చంటి బిడ్డలకు తల్లిపాలు అందుబాటులో లేనప్పుడు మానవ డోనర్ మిల్క్ను అందించే సదుపాయాన్ని రాష్ట్రంలోనే మొదటిసారిగా MBNR ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఇది ఒక అద్భుతమైన అవకాశమని కలెక్టర్ విజయేంద్ర బోయి కొనియాడారు. సుశేషణ హెల్త్ ఫౌండేషన్ సహకారంతో ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన సమగ్ర లాక్టేషన్ మేనేజ్మెంట్ సెంటర్ని ఎంపీ, ఎమ్మెల్యేలతో పాటు కలెక్టర్ ప్రారంభించారు.