News January 6, 2025

మహబూబ్‌నగర్‌: ఉరేసుకుని ఇద్దరి ఆత్మహత్య

image

ఉమ్మడి మహబూబ్‌నగర్‌కు చెందిన ఇద్దరు వేర్వేరు కారణాలతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాలిలా.. మల్దకల్‌కు చెందిన కుమ్మరి నర్సింహులు(42) గద్వాలలోని ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో రుణం తీసుకున్నారు. వారు లోన్ చెల్లించాలని ఒత్తిడి తేవటంతో ఈ నెల 3న ఉరేసుకున్నారు. నందివడ్డెమాన్‌కి చెందిన చెన్నయ్య(45) ఆదివారం ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నారు. బలవన్మరణానికి గల కారణాలు తెలియరాలేదు.

Similar News

News January 22, 2025

నిరుద్యోగుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

image

ఈనెల 23వ తేదీన బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో జాబ్ మేళా ఉంటుందని జిల్లా ఉపాధి కల్పన అధికారి ప్రియాంక ఒక ప్రకటనలో తెలిపారు. 18 -35 సంవత్సరాల వయసు ఉండి విద్యార్హత కలిగిన నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. జాబ్ మేళాలో ఎంపికైన నిరుద్యోగులకు హైదరాబాద్, కర్నూల్, గద్వాలలోని వివిధ కంపెనీలలో ఉద్యోగ అవకాశం కలుగుతుందని ఆమె తెలియజేశారు. నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. 

News January 21, 2025

విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని కలిసిన పీయూ వీసీ 

image

హైదరాబాద్‌లోని సెక్రటేరియట్ లో ప్రిన్సిపల్ సెక్రటరీ యోగిత రానాను మంగళవారం పాలమూరు యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య జీఎన్ శ్రీనివాస్, రిజిస్ట్రార్ ఆచార్య డీ.చెన్నప్ప మర్యాదపూర్వకంగా కలిశారు. యూనివర్సిటీలలో మౌలిక సదుపాయాలు, ఉద్యోగుల నియామకం, కొత్త కోర్సుల రూపకల్పన, మొదలైన అంశాల గురించి చర్చించారు.

News January 21, 2025

అధైర్య పడవద్దు.. అందరికీ సంక్షేమ పథకాలు: కలెక్టర్

image

ఎవరు అధైర్య పడకూడదని అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింప చేస్తామని గద్వాల కలెక్టర్ సంతోష్ పేర్కొన్నారు. ధరూర్ మండల కేంద్రంలో నిర్వహించిన గ్రామసభలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. గ్రామీణ ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రణాళిక ప్రకారం గ్రామసభలు నిర్వహించి, అర్హులకు పథకాలు వర్తింప చేస్తామన్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పారు.