News January 12, 2026

మహబూబ్‌నగర్: కరెంట్ షాక్‌తో రైతు మృతి

image

కోయిల్‌కొండ మండలంలోని పారుపల్లిలో పొలంలో విద్యుత్ తీగలు సరి చేసేందుకు వెళ్లి ఓ రైతు మృతి చెందాడు. ఎస్ఐ తిరుపాజీ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఎల్లపు తిరుపతయ్య (47) బోర్‌కు విద్యుత్ సరఫరా కావడం లేదని ట్రాన్స్‌ఫార్మ‌ర్ వద్దకు వెళ్లాడు. అక్కడ విద్యుత్ తీగలను సరి చేసేందుకు ప్రయత్నిస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ కొట్టింది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

Similar News

News February 14, 2026

మహబూబ్‌నగర్‌‌లో రీకౌంటింగ్..!

image

మహబూబ్‌నగర్ మేయర్ పీఠం ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. మొత్తం 60 డివిజన్లకు గాను 59 డివిజన్లలో పోలింగ్ జరిగింది. 58వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి ఏకగ్రీవంగా విజయం సాధించారు. 59 స్థానాల్లో కాంగ్రెస్-29, BRS-15, BJP-7, ఇతరులు 8 మంది విజయం సాధించారు. అయితే 53వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి తన సమీప ప్రత్యర్థి అయిన బీఆర్ఎస్ అభ్యర్థిపై 29 ఓట్ల మెజార్టీ రాగా.. అక్కడ రీకౌంటింగ్ జరుగుతోంది.

News February 13, 2026

మహబూబ్‌నగర్‌లో కౌంటింగ్‌ ఆలస్యం.. కారణం ఏంటో?

image

మహబూబ్ నగర్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్‌లో చాలా ఆలస్యం అవుతుంది. దీంతో కౌంటింగ్ కేంద్రం బయట కార్యకర్తల్లో ఆందోళన మొదలైంది. కౌంటింగ్ కేంద్రం లోపల ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటికి 1-30 డివిజన్‌ల ఫలితాలు వెలువడ్డాయి. ఇంకా 31-60 డివిజన్‌ల ఫలితాలు రావాల్సి ఉంది. ఎవరు ఆలస్యం చేస్తున్నారో అర్థం కావడం లేదని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

News February 13, 2026

మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో కాంగ్రెస్ ముందంజ

image

మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో కొనసాగుతుంది. మొత్తం 60 స్థానాలకు గాను 30 డివిజన్లకు లెక్కింపు పూర్తయింది. ఇందులో కాంగ్రెస్ పార్టీ 14 స్థానాల్లో, బీఆర్ఎస్ 9 స్థానాల్లో, బీజేపీ 4 స్థానాల్లో విజయం సాధించాయి. ఎంఐఎం 1, ఇతరులు 2 స్థానాల్లో విజయం సాధించారు. మిగిలిన స్థానాల్లో కాంగ్రెస్ స్పష్టమైన అధిక్యంలో కొనసాగుతుంది.