News March 20, 2025

మహబూబ్‌నగర్: చెత్త కుప్పలో మగ్గుతోన్న బాల్యం..!

image

దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని చెబుతున్నా ఇంకా పేదల జీవితంలో మార్పు రావడం లేదు. కడుపు నింపుకునేందుకు ఆ తల్లిదండ్రులు పిల్లలను ఇటుక బట్టీలకు, చెత్త కుప్పల్లో ఏరుకునేందుకు పంపిస్తున్నారు. ఇలాంటి పేదలను అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోరా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో బాల కార్మికులపై, పేదలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి ఆదుకోవాలని కోరుతున్నారు.

Similar News

News November 26, 2025

రాయికల్‌లో అత్యధికం.. జగిత్యాలలో అత్యల్పం

image

జగిత్యాల జిల్లాలో అత్యధికంగా గ్రామపంచాయతీలు రాయికల్ మండలంలో ఉండగా అత్యల్పంగా జగిత్యాల అర్బన్ మండలంలో ఉన్నాయి. రాయికల్ మండలంలో 32 పంచాయతీలు, 276 వార్డులు ఉన్నాయి. జగిత్యాల అర్బన్ మండలంలో 5 పంచాయతీలు, 50 వార్డులున్నాయి. త్వరలో జరగనున్న సర్పంచ్ ఎన్నికలలో రాయికల్ మండలంలో 32 మంది సర్పంచులు, 276 మంది వార్డు సభ్యులు, జగిత్యాల అర్బన్ మండలంలో ఐదుగురు సర్పంచులు, 50 మంది వార్డు సభ్యులు ఎన్నికవ్వనున్నారు.

News November 26, 2025

మిరపలో కొమ్మ ఎండు, కాయ కుళ్లు తెగులు – నివారణ

image

మిరపలో ఈ తెగులు తొలుత లేత కొమ్మలు, పూతకు ఆశించడం వల్ల పూత రాలి, చివర్ల నుంచి కొమ్మలు కిందకు ఎండుతాయి. కాయలను ఆశించడం వల్ల కాయల మీద నల్లటి మచ్చలు ఏర్పడి, కుళ్లి రాలిపోతాయి. ఈ తెగులు నివారణకు ఎకరాకు 200 లీటర్ల నీటిలో డైఫెనోకోనజోల్ 25% EC 100ml లేదా క్రెసోక్సిమ్-మిథైల్ 44.3% SC 200mlలలో ఏదో ఒకటి కలిపి పిచికారీ చేయాలి. తెగులు సోకిన మొక్కల భాగాలను సేకరించి నాశనం చేయాలి.

News November 26, 2025

రాజమండ్రి: మాక్ అసెంబ్లీ విజేతలకు కలెక్టర్ అభినందన

image

విద్యాశాఖ నిర్వహించిన మాక్ అసెంబ్లీ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బుధవారం కలెక్టర్ కీర్తి చేకూరి జ్ఞాపిక, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ, వారు మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయి మాక్ అసెంబ్లీలో 8 మంది విద్యార్థులు, జిల్లా స్థాయిలో 13 మంది విద్యార్థులు పాల్గొన్నారని ఆమె తెలిపారు.