News March 20, 2025
మహబూబ్నగర్: చెత్త కుప్పలో మగ్గుతోన్న బాల్యం..!

దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని చెబుతున్నా ఇంకా పేదల జీవితంలో మార్పు రావడం లేదు. కడుపు నింపుకునేందుకు ఆ తల్లిదండ్రులు పిల్లలను ఇటుక బట్టీలకు, చెత్త కుప్పల్లో ఏరుకునేందుకు పంపిస్తున్నారు. ఇలాంటి పేదలను అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోరా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో బాల కార్మికులపై, పేదలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి ఆదుకోవాలని కోరుతున్నారు.
Similar News
News November 21, 2025
‘స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి’

స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధం చేసి, సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని అధికారులను ఆదేశించారు. HYD నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, DGP శివధర్ రెడ్డితో కలిసి ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులు, పోలీసు ఉన్నతాధికారులతో పాటు HNK కలెక్టర్ స్నేహ శబరీష్ తదితరులు పాల్గొన్నారు.
News November 21, 2025
గాంధీభవన్: ఓటర్ ఇన్ఫర్మేషన్ను పబ్లిక్ డొమైన్లో పెట్టాలి: ఎమ్మెల్యే

ఓటర్ ఇన్ఫర్మేషన్ను పబ్లిక్ డొమైన్లో పెట్టాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. ఓట్ చోర్ గద్దె చోడ్ సిగ్నేచర్ కమిటీకి తనను ఛైర్మన్గా నియమించడం సంతోషంగా ఉందన్నారు. కమిటీ అంతా కలిసి పనులు విభజన చేసుకొని జిల్లా పర్యటనలు చేస్తామని చెప్పారు. డిజిటల్ ఓటర్ లిస్ట్ ఈసీ ప్రచురించాలని, అప్పుడే దొంగ ఓట్లు వేయడం ఆగుతుందన్నారు. ఓట్ చోరీకి బీజేపీ ఎలా పాల్పడుతుందో వివరిస్తామని వెల్లడించారు.
News November 21, 2025
గాంధీభవన్: ఓటర్ ఇన్ఫర్మేషన్ను పబ్లిక్ డొమైన్లో పెట్టాలి: ఎమ్మెల్యే

ఓటర్ ఇన్ఫర్మేషన్ను పబ్లిక్ డొమైన్లో పెట్టాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. ఓట్ చోర్ గద్దె చోడ్ సిగ్నేచర్ కమిటీకి తనను ఛైర్మన్గా నియమించడం సంతోషంగా ఉందన్నారు. కమిటీ అంతా కలిసి పనులు విభజన చేసుకొని జిల్లా పర్యటనలు చేస్తామని చెప్పారు. డిజిటల్ ఓటర్ లిస్ట్ ఈసీ ప్రచురించాలని, అప్పుడే దొంగ ఓట్లు వేయడం ఆగుతుందన్నారు. ఓట్ చోరీకి బీజేపీ ఎలా పాల్పడుతుందో వివరిస్తామని వెల్లడించారు.


