News April 16, 2025

మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ WARNING

image

రైతులు పండించిన ధాన్యాన్ని రోడ్లపై ఆరబోసి ప్రమాదాలకు కారణం కావద్దని మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ జానకి ధరావత్ హెచ్చరించారు. అతి వేగంగా రోడ్లపై ప్రయాణించే వాహనదారులు రోడ్లపై కుప్పలుగా ఉన్న ధాన్యాన్ని గమనించకపోవడంతో ప్రమాదాల బారిన పడుతున్నారన్నారు. రోడ్లపై ధాన్యం కుప్పలు పోసి వాటిపై నల్ల కవర్లు కప్పడంతో రాత్రి సమయంలో అవి కనిపించడం లేదని, ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోయే అవకాశం ఉంటుందన్నారు.

Similar News

News April 24, 2025

MBNR: 12 వందల ఏళ్ల క్రితం నాటి శివలింగం చరిత్ర ఇదే.!

image

దాదాపు 12 వందల ఏళ్ల క్రితం కాకతీయుల రాజప్రతినిధులు గోన గన్నారెడ్డి పరిపాలిస్తున్న కాలంలో అడ్డాకుల మండలం రాచాలలో వెలసిన దివ్యక్షేత్రం రామలింగేశ్వర స్వామి ఆలయం నిర్మించబడినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. స్వామివారి లింగం, ఆలయ నిర్మాణ శైలి సైతం కాకతీయుల నిర్మాణాలను పోలి ఉండటం, కందూరు గ్రామ శాసనాలలో ఆలయ ప్రస్తావన ఉండటం ఇందుకు సాక్ష్యంగా పరిశీలకులు పరిగణిస్తున్నారు.

News April 24, 2025

తుపాకీ గురిపెట్టిన MBNR ఎమ్మెల్యే

image

ఏనుగొండలో మల్టీ స్పోర్ట్స్ ఏరియాను మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎయిర్ ఫిస్టల్ షూటింగ్ గురించి ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. ఎయిర్ ఫిస్టల్‌ను ఎమ్మెల్యే తన చేతులతో ఎక్కుపెట్టి ఉత్సాహపరిచారు. అన్ని క్రీడలు ఒకే దగ్గర అందుబాటులో ఉంచడం పట్ల నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు. పట్టణ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News April 24, 2025

MBNR: ఈతకెళ్తున్నారా.. జర భద్రం !

image

స్కూళ్లకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఎండకాలంలో సేద తీరేందుకు పిల్లలు, పెద్దలు కలిసి ఈతకు వెళ్తుంటారు. బావులు, చెరువులు, నీటి ట్యాంకులు, కుంటల వద్ద ఈత కొడుతూ ఎంజాయ్‌ చేస్తారు. అయితే ఈత సరదా మాటున ప్రమాదం జరిగే అవకాశం ఉందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులు సూచించారు. సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా తల్లిదండ్రులు చూడాలన్నారు.

error: Content is protected !!