News April 4, 2025

మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు 

image

ఈనెల 7 నుంచి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెరవాలని కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులను ఆదేశించారు. గురువారం మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఐకేపీ కొనుగోలు కేంద్రాల ఇన్‌ఛార్జులు, ఏపీఎంలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వరి ఏ గ్రేడ్ రకానికి రూ.2,320, బి గ్రేడ్ రకానికి రూ.2,300 ధర నిర్ణయించినట్లు వెల్లడించారు.

Similar News

News November 22, 2025

MBNR: 24 గంటలు సిద్ధంగా ఉన్నాం.. ఫోన్ చేయండి: ఎస్పీ

image

బాలికలు, మహిళల భద్రతే పోలీసు శాఖ ప్రధాన బాధ్యత అని మహబూబ్‌నగర్ ఎస్పీ డి.జానకి అన్నారు. బస్‌స్టాండ్‌లు లేదా బహిరంగ ప్రదేశాల్లో అసురక్షితంగా అనిపిస్తే, వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 100కు లేదా షీ టీమ్ నంబర్ 8712659365కు కాల్ చేయాలని సూచించారు. మహిళల భద్రత కోసం పోలీసులు 24 గంటలు సిద్ధంగా ఉంటారని ఆమె హామీ ఇచ్చారు.

News November 22, 2025

MBNR: 24 గంటలు సిద్ధంగా ఉన్నాం.. ఫోన్ చేయండి: ఎస్పీ

image

బాలికలు, మహిళల భద్రతే పోలీసు శాఖ ప్రధాన బాధ్యత అని మహబూబ్‌నగర్ ఎస్పీ డి.జానకి అన్నారు. బస్‌స్టాండ్‌లు లేదా బహిరంగ ప్రదేశాల్లో అసురక్షితంగా అనిపిస్తే, వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 100కు లేదా షీ టీమ్ నంబర్ 8712659365కు కాల్ చేయాలని సూచించారు. మహిళల భద్రత కోసం పోలీసులు 24 గంటలు సిద్ధంగా ఉంటారని ఆమె హామీ ఇచ్చారు.

News November 21, 2025

MBNR: ప్రయాణికురాలిగా బస్టాండ్‌లో ఎస్పీ పరిశీలన

image

మహబూబ్ నగర్ జిల్లాలోని ‘ప్రజా భద్రత–పోలీసు బాధ్యత కార్యక్రమం’ కొనసాగుతున్న సందర్భంలో జిల్లా ఎస్పీ డి.జానకి శుక్రవారం మహబూబ్ నగర్ ఆర్టీసీ బస్టాండ్‌లో సాధారణ మహిళలా నడుచుకుంటూ ప్రత్యక్ష పరిశీలనలు నిర్వహించింది. బస్టాండ్‌లో వేచి ఉన్న బాలికలతో, మహిళలతో వ్యక్తిగతంగా మాట్లాడి, ఎవరి నుండైనా వేధింపులు, అసౌకర్యాలు, అనుమానాస్పద ప్రవర్తన వంటి సమస్యలు ఎదురైతే వెంటనే ధైర్యంగా పోలీసులకు తెలియజేయాలన్నారు.