News September 20, 2024
మహబూబ్నగర్: తండ్రిని చంపేశాడు..!

ఓ యువకుడు తండ్రిని హత్య చేశాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. రాజాపూర్ మండలం రాయపల్లికి చెందిన కావలి నారాయణని అతడి కుమారుడు నందు హత్య చేశాడు. గురువారం రాత్రి అందరూ పడుకున్నాక గొడ్డలితో నరికి చంపాడు. నందుకు కొంత కాలంగా మతిస్థిమితం లేదు. ఏ పని చేయకుండా ఊర్లో తిరుగుతుండేవాడు. కాగా రోజూ నారాయణ ఇంటికి గొళ్లెం పెట్టుకునేవాడు. రాత్రి పెట్టుకోకపోవడంతో అదును చూసి చంపేయగా నందును పోలీసులు అరెస్ట్ చేశారు.
Similar News
News November 11, 2025
MBNR: ఖో-ఖో సెలక్షన్స్.. విజేతలు వీరే..!

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో అండర్-14 విభాగంలో బాల, బాలికలకు ఖో-ఖో ఎంపికలు నిర్వహించారు. మొత్తం 550 మంది క్రీడాకారులు పాల్గొనగా.. ఎంపికైన వారిని ఉమ్మడి జిల్లా స్థాయికి పంపించారు.
✒బాలికల విభాగం
1)మొదటి బహుమతి:బాలానగర్
2)రెండవ బహుమతి:మహమ్మదాబాద్
✒బాలుర విభాగం
1)మొదటి బహుమతి:నవాబ్ పేట్
2)రెండో బహుమతి:కోయిలకొండ
News November 11, 2025
జడ్చర్ల: 305 గ్రాముల గంజాయి స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

జడ్చర్ల మండలం బండమీదిపల్లి శివారు ఆర్.బి.ఆర్ కంపెనీలో వంట మాస్టర్గా పనిచేస్తూ గంజాయి విక్రయిస్తున్న జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ప్రకాష్ రవిదాస్ను అరెస్ట్ చేసి అతని వద్ద 350 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు ఎక్సైజ్ సీఐ విప్లవ రెడ్డి తెలిపారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ ఎస్సై కార్తీక్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ రమేష్, కానిస్టేబుల్ సిద్ధార్థ పాల్గొన్నారు.
News November 10, 2025
MBNR: రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు: మంత్రి

మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు చేసిన ధాన్యానికి ఎప్పటికప్పుడు డబ్బులు చెల్లించాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.


