News April 4, 2025
మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల బీఎస్పీ ముఖ్య నేతల సమావేశం

బహుజన సమాజ్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు శుక్రవారం మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల ముఖ్యనాయకుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ ఇబ్రహీం శేఖర్ హాజరై పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేశారు. ఆర్థికంగా సామాజికంగా ఎదిగి ఇతరులకు సహాయపడాలని, సమాజంలో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలను రాజ్యాంగ బద్ధంగా ప్రశ్నించాలన్నారు.
Similar News
News December 23, 2025
WGL: ఉదయం 6 గంటలకే సర్పంచ్ ఏం చేశారో చూడండి..!

జిల్లాలోని వర్ధన్నపేట మండలం ఇల్లంద సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేసిన బేతి సాంబయ్య తొలి రోజే కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. ఉదయం 6 గంటలకే పంచాయతీ కార్యాలయానికి చేరుకొని పారిశుద్ధ్య కార్మికుల రికార్డులను పరిశీలించారు. ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి, పార్టీలకతీతంగా అందరి సహకారంతో గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని ఆయన తెలిపారు. విధుల పట్ల అధికారులు, సిబ్బంది అలసత్వం వహించొద్దన్నారు.
News December 23, 2025
తూ.గో: 500 అడిగి.. ఆత్మహత్య చేసుకున్నాడు..!

అమలాపురం మెట్ల కాలనీలో దీపక్రాజ్(18) సోమవారం <<18637820>>ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం తెలిసిందే<<>>. చెడు వ్యసనాలకు బానిసైన అతడు ఆదివారం రాత్రి మద్యం కోసం తల్లిని రూ.500 అడిగాడు. ఆమె డబ్బులు పంపడంతో మద్యం తాగి ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులతో గొడవపడ్డాడు. అనంతరం ఉరివేసుకుని ప్రాణాలు విడిచాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
News December 23, 2025
అంతా హేమాహేమీలే.. భూపేశ్కు కత్తి మీద సామే!

కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా భూపేశ్ రెడ్డి నియమితులైన సంగతి తెలిసిందే. రాజకీయ అనుభవం తక్కువగా ఉన్న ఆయనకు జిల్లాలోని హేమాహేమీలైన నేతలను మేనేజ్ చేయడం కత్తిమీద సాములాంటిదనే చెప్పాలి. ఎమ్మెల్యేలందర్నీ ఒకతాటిపై తీసుకొచ్చి.. లోకల్ బాడీ ఎన్నికల్లో టీడీపీకి అధిక సీట్లను కైవసం చేసుకునేలా చేయడం ఆయనకు అతి పెద్ద టాస్క్. అలాగే అంతర్గత పార్టీ కుమ్ములాటలకు భూపేశ్ ఏ విధంగా పరిష్కారం చూపుతారనేది చూడాలి.


