News April 6, 2025
మహబూబ్నగర్: నేడు శ్రీరామకొండకు వెళ్తున్నారా..?

మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండ మండలంలోని శ్రీరామకొండపై వెలసిన స్వయంభు శ్రీరామపాద ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామకొండ క్షేత్రంలో శ్రీసీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించనున్నట్లు శ్రీరామకొండ అర్చకుడు రాఘవేంద్రరావు తెలిపారు. శనివారం శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయం నుంచి శ్రీరామకొండ వరకు శ్రీసీతారాముల పల్లకీ సేవ నిర్వహించామన్నారు. ఆదివారం ఉ.11.45 గంటలకు జరిగే కళ్యాణంలో భక్తులు పాల్గొనాలని కోరారు.
Similar News
News October 23, 2025
MBNR: పోలీస్ ప్రధాన కార్యాలయంలో నేర సమీక్ష నిర్వహించిన ఎస్పీ

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ జానకి నెల వారి నేర సమీక్షను గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. క్రైమ్కు సంబంధించిన అన్ని వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని అన్నారు. దర్యాప్తు నాణ్యతను మెరుగుపరిచి న్యాయస్థానాల్లో దోషులకు శిక్షపడేలా బలమైన సాక్ష్యాలు సేకరించాలన్నారు.
News October 23, 2025
మహమ్మదాబాద్లో అత్యధిక వర్షపాతం

మహబూబ్నగర్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో మహమ్మదాబాద్ మండలంలో 13.8 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. హన్వాడ 13.7, కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్ 4.8, గండీడ్ మండలం సర్కార్ పేట, దేవరకద్ర 3.8 , మహబూబ్నగర్ గ్రామీణం, భూత్పూర్ 3.3, జడ్చర్ల 3.0, నవాబుపేట మండలం కొల్లూరు 2.5, బాలానగర్ 2.0 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డ్ అయింది.
News October 23, 2025
చలో రాజ్ భవన్: రాచాల యుగంధర్ గౌడ్

సంస్థల ఎన్నికల్లో బీసీ వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, వాటిని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ బీసీ పొలిటికల్ JAC ఆధ్వర్యంలో భారీ స్థాయిలో “ఛలో రాజ్ భవన్” కార్యక్రమం నిర్వహించనున్నట్లు బీసీ పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈరోజు ఉదయం 10:00 గంటలకు హైదరాబాద్లోని రాజ్ భవన్ వద్ద జరుగనున్న ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.