News April 3, 2025

మహబూబ్‌నగర్ బిడ్డలు తగ్గేదేలే: MLA

image

విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. పట్టణంలో బుధవారం ఆయన నీట్, ఎంసెట్ కోర్సులో చేరిన విద్యార్థులతో మాట్లాడారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ రెండో సంవత్సరం పూర్తి చేసిన విద్యార్థులకు ఎమ్మెల్యే తన సొంత నిధులతో నీట్, ఎంసెట్ కోర్స్‌ను అందిస్తున్నారు. మహబూబ్‌నగర్ బిడ్డలు ఎందులోనూ తక్కువ కాదని, ఏదైనా అనుకుంటే సాధించి తీరుతారని ఆయన అన్నారు.

Similar News

News April 11, 2025

ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక సరఫరా: కలెక్టర్

image

ఇందిరమ్మ ఇళ్లనిర్మాణానికి ఉచితంగా ఇసుకను సరఫరా చేయాలని మహబూబ్ నగర్ కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తహశీల్దార్లు, పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇందిరమ్మఇంటి నిర్మాణాలకు కావాల్సిన ఇసుకను లబ్ధిదారులకు సరఫరా చేసేందుకు పంచాయతీ కార్యదర్శి ధ్రువీకరించి తహశీల్దార్లకు పంపించాలన్నారు. 

News April 11, 2025

ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS!

image

✔పలుచోట్ల ఈదురుగాలులతో వర్ష బీభత్సం
✔రేపు పూలే జయంతి వేడుకలు
✔నాగర్‌కర్నూల్: సిరసనగండ్ల రథోత్సవంలో లక్షల మంది
✔సళేశ్వరంలో ఆదివాసీ చెంచులే పూజారులు
✔KCR సభకు..BRS పార్టీ శ్రేణులకు పిలుపు
✔ఉమ్మడి జిల్లాల్లో జోరుగా వరి కోతలు
✔NGKL:చిన్నతగాదాతో భార్యాభర్తల సూసైడ్
✔IPL బెట్టింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు:ఎస్సైలు
✔పలుచోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం

News April 10, 2025

ఇక నుంచి మానవ డోనర్ మిల్క్: జిల్లా కలెక్టర్

image

చంటి బిడ్డలకు తల్లిపాలు అందుబాటులో లేనప్పుడు మానవ డోనర్ మిల్క్‌ను అందించే సదుపాయాన్ని రాష్ట్రంలోనే మొదటిసారిగా MBNR ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఇది ఒక అద్భుతమైన అవకాశమని కలెక్టర్ విజయేంద్ర బోయి కొనియాడారు. సుశేషణ హెల్త్ ఫౌండేషన్ సహకారంతో ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన సమగ్ర లాక్టేషన్ మేనేజ్మెంట్ సెంటర్‌ని ఎంపీ, ఎమ్మెల్యేలతో పాటు కలెక్టర్ ప్రారంభించారు.

error: Content is protected !!