News April 12, 2025
మహబూబ్నగర్: ‘భారీగా మామిడి పండ్ల ధరలు’

వేసవి కాలం నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని మార్కెట్లలో మామిడి పండ్ల కొనుగోళ్లు షురూ అయ్యాయి. ప్రస్తుతం మామిడి పండ్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని ప్రజలు అంటున్నారు. ఒక్కో బాక్స్కు ధర రూ.7,000 నుంచి రూ.8,000 వరకు పలుకుతుందని చెప్పారు. రిటైల్ మార్కెట్లో కేజీ ధర రూ.150 నుంచి రూ.250 వరకు అమ్మడంతో సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మీ ప్రాంతంలో రేట్ ఎంత ఉంది.. కామెంట్ చేయండి.
Similar News
News January 10, 2026
NTR: కిడ్నీ బాధితులకు అండగా ఎంపీ చిన్ని

తిరువూరు నియోజకవర్గం ఏ.కొండూరు మండలం పరిధిలోని కిడ్నీ బాధితులకు విజయవాడ ఎంపీ చిన్ని తన సొంత నిధులు రూ. 6-7లక్షలు వెచ్చించి సుమారు వెయ్యి మందికి పౌష్టికాహారం కిట్లను పంపిణీ చేస్తున్నారు. కిట్లలో జొన్నపిండి, నువ్వులు, అటుకులు, చిక్కీ ఇతర ఆహార పదార్థలు ఉన్నాయి. మరో 10 రోజుల్లో CM చంద్రబాబు, Dy.CM పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో కిడ్నీ బాధిత 52 గ్రామాలకు కృష్ణా నది నీటి పంపిణీ ప్రారంభించినున్నారు.
News January 10, 2026
GNT: CRDAలో ఉద్యోగ అవకాశాలు

రాజధాని ప్రాంతంలో CRDAలో పనిచేయుటకు ఉద్యోగ అవకాశాలు ఉన్నట్లు తాడికొండ ఎమ్మెల్యే కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఆసక్తి ఉన్న యువతీ, యువకులు తమ వివరాలను గుంటూరులోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఈ నెల 12 లోగా అందజేయాలన్నారు. పూర్తి వివరాలకు CRDA సీనియర్ లైవ్లీహుడ్ స్పెషలిస్ట్ శంకర్ను సంప్రదించాలని చెప్పారు.
News January 10, 2026
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి కొత్త హీరో.. ఫస్ట్ లుక్ రిలీజ్

సూపర్ స్టార్ కృష్ణ మనుమడు, ఘట్టమనేని రమేశ్ బాబు తనయుడు జయకృష్ణ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ‘RX 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తున్న మూవీకి ‘శ్రీనివాస మంగాపురం’ అనే టైటిల్ను ఖరారు చేశారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ను మహేశ్ బాబు తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో రవీనా టాండన్ కూతురు రాషా తడాని హీరోయిన్గా నటిస్తుండగా, జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్నారు.


