News April 2, 2025

మహబూబ్‌నగర్: మంత్రి ధర్మేంద్రను కలిసిన మాజీ మంత్రి

image

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూవివాదంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను బీఆర్ఎస్ మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. కాంగ్రెస్ సర్కార్ విద్యార్థులపై దమనకాండ చేస్తోందని ఫిర్యాదు చేశారు. యూనివర్సిటీ భూములను కాపాడాలని, విద్యార్థులపై లాఠీఛార్జి చేశారన్నారు. వారికి న్యాయం చేయాలని వినతి పత్రం అందజేశారు.

Similar News

News November 21, 2025

BREAKING: వరంగల్: ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు బదిలీ

image

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ముగ్గురు ఇన్‌‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ సీపీ సన్ ప్రీత్ సింగ్ ఈరోజు ఉత్తర్వులు జారీచేశారు. బదిలీ అయిన వారిలో మామూనూర్ ఇన్‌స్పెక్టర్ ఓ.రమేశ్ వీఆర్‌కు బదిలీ కాగా, ఐటీ కోర్ ఇన్‌స్పెక్టర్ ఈ.శ్రీనివాస్ మామూనూర్‌‌కు బదిలీ అయ్యారు. వీఆర్‌లో విధులు నిర్వహిస్తున్న ఏ.ప్రవీణ్ ఐటీ కోర్ సెల్‌కు బదిలీ అయ్యారు.

News November 21, 2025

వాట్సాప్‌లో అందుబాటులోకి షెడ్యూల్ కాల్ ఫీచర్..

image

టీమ్స్, గూగుల్ మీట్ తరహా ఫీచర్‌ను వాట్సాప్ అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఎంప్లాయీస్, ఫ్రెండ్స్, ఫ్యామిలీతో మీటింగ్ షెడ్యూల్ చేసుకోవచ్చు. వాయిస్‌తోపాటు వీడియో కాల్ ఆప్షన్‌ కూడా అందుబాటులో ఉంది. కాల్ పెడుతున్న ఉద్దేశం చెప్పొచ్చు. ఎవరు కనెక్ట్ కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. జనరేట్ అయిన లింకును కాపీ చేసి పార్టిసిపెంట్స్‌కు షేర్ చేయవచ్చు. కాల్ మొదలయ్యే ముందు పార్టిసిపెంట్స్‌కు నోటిఫికేషన్ వెళుతుంది.

News November 21, 2025

భూపాలపల్లి: మెడికల్ ఆఫీసర్లతో డీఎంహెచ్‌వో సమావేశం

image

భూపాలపల్లిలో మెడికల్ ఆఫీసర్లతో డీఎంహెచ్‌వో మధుసూదహన్ ఈరోజు సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఉన్న ప్రతి ఆరోగ్య ఉపకేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ఆరోగ్య కార్యకర్తలు వేసెక్టమీ క్యాంపు & మొబలైజేషన్‌కు సంబంధించిన విషయాలన్నీ ప్రజలకు తెలిపాలన్నారు. అత్యధికంగా ఎంఎస్సీ ఆపరేషన్లు అయ్యేటట్టు పురుషులను మోటివేషన్ చేయాలని తెలియజేశారు.