News April 6, 2025
మహబూబ్నగర్: ‘మా పోరాటం ఆగదు’

రాజ్యాంగానికి విరుద్ధంగా పాలిస్తున్న మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు తమ పోరాటం ఆగదని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్ అన్నారు. ఏఐటీయూసీ 12వ జిల్లా మహాసభలు శనివారం మహబూబ్నగర్లో ముగిశాయి. ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగం ద్వారా కల్పించిన చట్టబద్ధ హక్కులను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం హరిస్తోందని మండిపడ్డారు. అధికార మదంతో మతపిచ్చి పట్టి మోదీ ప్రభుత్వం ప్రజల మధ్య చిచ్చు పెడుతోందని ఆరోపించారు.
Similar News
News December 4, 2025
పీయూలో ఎన్ఎస్ఎస్ ఒరియంటేషన్ కరపత్రం ఆవిష్కరణ

డిసెంబర్ 10న పాలమూరు యూనివర్సిటీలో Challenges Facing by Women and Youth అంశంపై ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు ఒరియంటేషన్ కార్యక్రమం జరుగనుందని వీసీ ఆచార్య జి.ఎన్. శ్రీనివాస్ తెలిపారు. బ్రోచర్ను రిజిస్ట్రార్ ఆచార్య పూస రమేష్ బాబుతో కలిసి ఆవిష్కరించారు. ముఖ్య వక్తగా మెల్బోర్న్ నుంచి BYM ఫౌండర్ ప్రొఫెసర్ సరోజ గుళ్లపల్లి పాల్గొననున్నారు. కోఆర్డినేటర్ డా ప్రవీణ, పీవో డా.రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
News December 4, 2025
MBNR: పొగమంచు సమయంలో జాగ్రత్తలే రక్షణ–ఎస్పీ

చలికాలం ప్రారంభమై జిల్లా వ్యాప్తంగా ఉదయం,రాత్రి వేళల్లో పొగమంచు తీవ్రంగా ఏర్పడుతున్న నేపథ్యంలో రోడ్లపై దృష్టి తగ్గడం, ముందున్న వాహనాల దూరం అంచనా కష్టపడడం వంటి ప్రమాదాలు పెరిగే అవకాశం ఉన్నందున, ప్రమాదాలు నివారించడం కోసం డ్రైవర్లు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఎస్పీ డి.జానకి సూచించారు. పొగమంచు వలన రోడ్డు, సిగ్నల్స్, వాహనాలు స్పష్టంగా కనిపించకపోవడం వల్ల ప్రమాదాలు జరగవచ్చని పేర్కొన్నారు.
News December 4, 2025
MBNR: ఉద్యోగులు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే.. వేటు..!

ఉమ్మడి పాలమూరు జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. 3 విడుదల ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ కఠిన నిబంధనలు జారీ చేసింది. ప్రభుత్వ గౌరవ వేతనం పొందుతున్న ఉద్యోగులు సర్పంచ్, వార్డు ఎన్నికల్లో పోటీ చేయాలంటే ముందుగా రాజీనామా చేయాలని స్పష్టం చేసింది. అంగన్వాడీ కార్యకర్తలు, ఉపాధి హామీ పథకం సిబ్బంది, గోపాలమిత్రాలు, సీసీలు వంటి వర్గాలు ఏ అభ్యర్థి ప్రచారంలో పాల్గొన్న ఉద్యోగం పోతుంది. జాగ్రత్త సుమా..!


