News August 9, 2024
మహబూబ్నగర్: ALERT.. రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు

రోజురోజుకు సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా IAS, IPS అధికారుల పేరుతో దోపిడీకి ప్లాన్ చేస్తున్నారు. మహబూబ్నగర్, నాగర్కర్నూల్ కలెక్టర్ల పేరు, ఫొటోలతో ఫేక్ వాట్సాప్ క్రియేట్ చేసిన కేటుగాళ్లు తాజాగా NGKL ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ డీపీతో ఫేక్ ఇన్స్టా ఖాతా తెరిచి పలువురికి మెసేజ్లు పంపారు. విషయం తెలుసుకున్న ఎస్పీ.. ఇలాంటి వాటికి స్పందించవద్దని, పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ తెలిపారు.
Similar News
News October 22, 2025
రేపు కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల కోఆర్డినేషన్ మీటింగ్

కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా రేపు కోనేరు వద్ద ఉన్న కళ్యాణ మండపంలో అన్ని శాఖల అధికారులతో కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయేందిర బోయితో పాటు దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి కూడా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా జాతరకు సంబంధించిన ఏర్పాట్లు సహా తదితర ముఖ్య అంశాలపై సమీక్షించనున్నారు.
News October 21, 2025
పాలమూరు వర్శిటీ.. దేశవ్యాప్తంగా వినిపించాలి:VC

పాలమూరు వర్శిటీ పేరు దేశవ్యాప్తంగా వినిపించేలా పథకాలు సాధించాలని వర్శిటీ ఉపకులపతి ప్రొఫెసర్ జిఎన్ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం ఆర్చరీ పురుషుల జట్టుకు క్రీడా దుస్తులు పంపిణీ చేశారు. సౌత్ జోన్(ఆల్ ఇండియా ఇంటర్ వర్శిటీ) టోర్నమెంట్లో పాల్గొనేందుకు ఆర్చరీ జట్టు గురుకాసి వర్శిటీ పంజాబ్కు బయలుదేరారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.రమేష్ బాబు, అసోసియేట్ ప్రొ.డాక్టర్ ఎన్.కిషోర్,PD శ్రీనివాసులు పాల్గొన్నారు.
News October 21, 2025
నవాబుపేట: క్షతగాత్రుడి వివరాలు తెలిస్తే చెప్పండి

నవాబుపేట మండలంలోని ఫతేపూర్ మైసమ్మ దేవాలయ సమీపంలో రెండు రోజుల క్రితం ద్విచక్ర వాహనంపై వెళుతూ.. ఓ వ్యక్తి కిందపడ్డాడు. ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గాయాల పాలైన ఆ వ్యక్తి ఆచూకీ తెలిస్తే.. 8712659340 సమాచారం ఇవ్వాలని ఎస్సై విక్రం మంగళవారం తెలిపారు.