News April 5, 2025
మహబూబ్నగర్: ‘CM రేవంత్ రెడ్డికి THANKS’

DSC-2008 అభ్యర్థుల 15 సంవత్సరాల నిరీక్షణను సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిందని DSC-2008 అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు మాలతి రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో 2008 డీఎస్సీ అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి న్యాయం చేసినందుకు పాలాభిషేకం చేశారు. అనేక సంవత్సరాలుగా డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్న తమకు సీఎం న్యాయం చేశారన్నారు. MBNR జిల్లా గండీడ్ మండల ఉపాధ్యాయులు ఉన్నారు.
Similar News
News December 4, 2025
జడ్చర్ల: విద్యార్థినిపై వైస్ ప్రిన్సిపల్ లైంగిక వేధింపులు..!

జడ్చర్ల మండలంలోని ఒక గురుకుల పాఠశాలలో విద్యార్థినిపై మహిళ వైస్ ప్రిన్సిపల్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండలంలోని ఒక గురుకుల పాఠశాలలో షి టీం ఆధ్వర్యంలో నేరాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహిస్తుండగా విద్యార్థిని పోలీసులకు తెలిపింది. ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు విచారణ నిర్వహించి వైస్ ప్రిన్సిపల్పై కేసు నమోదు చేశారు.
News December 4, 2025
పీయూలో ఎన్ఎస్ఎస్ ఒరియంటేషన్ కరపత్రం ఆవిష్కరణ

డిసెంబర్ 10న పాలమూరు యూనివర్సిటీలో Challenges Facing by Women and Youth అంశంపై ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు ఒరియంటేషన్ కార్యక్రమం జరుగనుందని వీసీ ఆచార్య జి.ఎన్. శ్రీనివాస్ తెలిపారు. బ్రోచర్ను రిజిస్ట్రార్ ఆచార్య పూస రమేష్ బాబుతో కలిసి ఆవిష్కరించారు. ముఖ్య వక్తగా మెల్బోర్న్ నుంచి BYM ఫౌండర్ ప్రొఫెసర్ సరోజ గుళ్లపల్లి పాల్గొననున్నారు. కోఆర్డినేటర్ డా ప్రవీణ, పీవో డా.రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
News December 4, 2025
MBNR: పొగమంచు సమయంలో జాగ్రత్తలే రక్షణ–ఎస్పీ

చలికాలం ప్రారంభమై జిల్లా వ్యాప్తంగా ఉదయం,రాత్రి వేళల్లో పొగమంచు తీవ్రంగా ఏర్పడుతున్న నేపథ్యంలో రోడ్లపై దృష్టి తగ్గడం, ముందున్న వాహనాల దూరం అంచనా కష్టపడడం వంటి ప్రమాదాలు పెరిగే అవకాశం ఉన్నందున, ప్రమాదాలు నివారించడం కోసం డ్రైవర్లు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఎస్పీ డి.జానకి సూచించారు. పొగమంచు వలన రోడ్డు, సిగ్నల్స్, వాహనాలు స్పష్టంగా కనిపించకపోవడం వల్ల ప్రమాదాలు జరగవచ్చని పేర్కొన్నారు.


