News August 20, 2024

మహబూబ్‌నగర్ RTC రీజియన్ ఆల్ టైం రికార్డ్

image

రాఖీ పండుగ సందర్భంగా మహబూబ్ నగర్ ఆర్టీసీ రీజియన్ RTC చరిత్రలో ఆల్ టైం రికార్డు సృష్టించింది. రాఖీ పండుగ రోజున మొత్తంగా 3.71 లక్షల కిలోమీటర్లు ఆర్టీసీ బస్సులు తిరగగా, 2.88 కోట్ల రాబడిని ఆర్టీసీ రాబట్టిందని రీజినల్ మేనేజర్ శ్రీదేవి వెల్లడించారు. మొత్తంగా 5.88 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారన్నారు. డిపోలోనే రాఖీ పండగ కార్యక్రమం విజయవంతమైందన్నారు.

Similar News

News December 16, 2025

ఉమ్మడి జిల్లాలో ఈనాటి ముఖ్యంశాలు

image

✔ఓటు హక్కును వినియోగించుకోండి:ఎస్పీలు
✔ఫేస్-3 సర్పంచ్ ఎన్నికలు..సర్వం సిద్ధం:కలెక్టర్లు
✔T-20 క్రికెట్ లీగ్.. గద్వాల్ జట్టు ఎంపిక
✔సర్పంచ్ ఎన్నికలు భారీ బందోబస్తు:ఎస్పీలు
✔సౌత్ జోన్.. ఈనెల 19న టేబుల్ టెన్నిస్ ఎంపికలు
✔సౌత్ జోన్.. ఈనెల 20న షటిల్,బ్యాడ్మింటన్ ఎంపికలు
✔మక్తల్:సర్పంచ్ ఎన్నికలు.. క్షుద్ర పూజల కలకలం
✔రేపు మహబూబ్ నగర్‌లో క్రికెట్ జట్టు ఎంపికలు

News December 16, 2025

MBNR: ఓటు హక్కును వినియోగించుకోండి- ఎస్పీ

image

ప్రతి ఓటరు ఎలాంటి భయభ్రాంతులు లేకుండా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ డి.జానకి పిలుపునిచ్చారు. పలు గ్రామాల్లో పర్యటించిన అనంతరం మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఏవైనా సమస్యలు, అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా పికెటింగ్, మొబైల్ పార్టీలు, స్ట్రైకింగ్ ఫోర్సులు ఏర్పాటు చేశామన్నారు.

News December 16, 2025

MBNR: ఫేస్-3..సిబ్బందికి ఎస్పీ డి.జానకి సమగ్ర బ్రీఫింగ్

image

స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా బుధవారం జరగనున్న గ్రామపంచాయతీ మూడో విడత ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో మంగళవారం జడ్చర్ల మండల కేంద్రంలో BRR ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు ఎన్నికల బందోబస్తు విధులకు హాజరైన పోలీసు అధికారులు, సిబ్బందికి జిల్లా ఎస్పీ డి.జానకి సమగ్ర బ్రీఫింగ్ నిర్వహించారు.