News April 15, 2025
మహబూబ్ నగర్ జిల్లాలో.. ఒకే రోజు ఐదుగురి మృతి

MBNR జిల్లాలో ఒకేరోజు వేర్వేరు ఘటనల్లో సోమవారం ఐదు మంది మృతి చెందారు. జిల్లా కేంద్రం సమీపంలోని దివిటిపల్లి వద్ద క్వారీ గుంతలో పడి విజయ్, సుశాంత్, మహమ్మద్ మృతి చెందగా.. బాలానగర్ మండలంలోని గంగాధర్పల్లిలో చేపల పేటకు వెళ్లి రాములును కాపాడబోయి యాదయ్య కూడా గల్లంతయ్యాడు. ఈ రెండు ఘటనలతో మహబూబ్ నగర్ జిల్లాలో సోమవారం తీవ్ర విషాదం నెలకొంది. చనిపోయిన ఐదుగురు నిరుపేద కుటుంబాలకు చెందినవారు.
Similar News
News December 19, 2025
ధనుర్మాసం: నాల్గోరోజు కీర్తన

‘ఓ మేఘుడా! లోభం చూపకుండా సముద్రపు నీటిని నిండుగా తాగి, నారాయణుని నల్లని మేని రంగును ధరించి ఆకాశానికి ఎగయుము. స్వామి సుదర్శన చక్రంలా మెరిసి, పాంచజన్య శంఖంలా గంభీరంగా గర్జించు. శారంగ ధనుస్సు నుంచి వచ్చే బాణాల వలె అమృతధారలను కురిపించు. లోకమంతా సుఖంగా ఉండాలని, మా వ్రతం నిర్విఘ్నంగా సాగాలని వెంటనే వర్షించు’ అని సమస్త జీవరాశికి మేలు కోసం అండాల్ దేవి పర్జన్యుని వేడుకుంటోంది. <<-se>>#DHANURMASAM<<>>
News December 19, 2025
రేపే T20 WC జట్టు ప్రకటన!

భారత T20 WC జట్టును శనివారం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్గా సూర్య, వైస్ కెప్టెన్గా గిల్ను కొనసాగించనున్నారు. SA సిరీస్కు ఎంపిక చేసిన జట్టులో నుంచి ఒకరిద్దరిని తొలగించి వారి స్థానంలో ఇషాన్ కిషన్, పంత్, అయ్యర్, రింకూ, జురెల్కు చోటు కల్పించే అవకాశాలున్నట్లు క్రీడావర్గాలు తెలిపాయి. అయితే సూర్య, గిల్ ఫామ్ ఆందోళన కలిగించే అంశంగా పేర్కొన్నాయి. 2026 FEB 7- MAR 8 వరకు T20 WC జరగనుంది.
News December 19, 2025
ఈనెల 21న జాతీయ లోక్ అదాలత్

ఈనెల 21న భద్రాద్రి జిల్లాలోని అన్ని కోర్టుల్లో జాతీయ లోక్ అదాలత్ జరుగుతుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాజేందర్ తెలిపారు. ఏమైనా కేసులు ఉన్నట్లైతే వాటిని రాజీ చేసుకోవచ్చన్నారు. కక్షిదారులు తమ కేసులను రాజీమార్గంలో పరిష్కరించుకోవడం వల్ల సమయం, డబ్బు ఆదా అవుతుందని చెప్పారు. పెండింగ్ కేసుల పరిష్కారం కోసం ఈ లోక్ అదాలత్ను నిర్వహిస్తున్నామని తెలిపారు. కేసుల పరిష్కారానికి కృషి చేయాలన్నారు.


