News March 29, 2024
మహబూబ్ నగర్: మ్యాజిక్ ఫిగర్ 720 ఓట్లు
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ ఎన్నికలో ఓటర్లు మొదటి, రెండు, మూడో ప్రాధాన్యత ఓట్లను వేయాల్సి ఉంటుంది. మొదటి ప్రాధాన్యత ఓటు వేయకుండా రెండు, మూడో ప్రాధాన్యత ఓటు వేసినా ఆ ఓటు చెల్లదు. ఉమ్మడి జిల్లాలో 1,439 ఓట్లకు గానూ.. 1,437 ఓట్లు పోలయ్యాయి. మ్యాజిక్ ఫిగర్ 720 ఓట్లు. మొదటి ప్రాధాన్యత ఓటుగా 720 ఓట్లు ఎవరికి పోల్ అయితే వారిదే విజయం.
Similar News
News October 4, 2024
MBNR: సంచలన విజయం.. ఫైనల్లోకి పాలమూరు జట్టు
ఓరుగల్లులో రాష్ట్రస్థాయి U-19 టోర్నీలో ఉమ్మడి MBNR జట్టు ఘన విజయం సాధించింది. శుక్రవారం సెమీస్లో ఖమ్మం జట్టుపై 60 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన జిల్లా జట్టు 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. జిల్లా బౌలర్ల దాటికి ఖమ్మం జట్టు 39.3 ఓవర్లలో 174 పరుగులకే ఆలౌట్ అయింది. జిల్లా జట్టు నుంచి అబ్దుల్ రాఫె-110 పరుగులు, MD ముఖిత్ 4 వికెట్లు తీశారు.
#CONGRATULATIONS
News October 4, 2024
12న పాలమూరుకి సీఎం రేవంత్ రెడ్డి
దసరా పండుగకు సీఎం రేవంత్ రెడ్డి సొంత ఊరికి రానున్నారు. ఈనెల 12న దసరా పండుగ సందర్భంగా వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లి గ్రామానికి చేరుకొని అక్కడ వేడుకలలో పాల్గొంటారు.. అదేవిధంగా గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభిస్తారు. సీఎం రాక సందర్భంగా కొండారెడ్డిపల్లి గ్రామాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రతి ఏడాది దసరాను రేవంత్ రెడ్డి ఇక్కడే జరుపుకుంటారు.
News October 4, 2024
రేపు మన్ననూరులో గద్దర్ విగ్రహవిష్కరణ
నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని మన్ననూరు గ్రామంలో రేపు గద్దర్ విగ్రహవిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ మరియు పలువురు బహుజన మేధావులు హాజరు అవుతారన్నారు. ఏపూరి సోమన్న బృందంతో సాంసృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.