News March 29, 2024
మహబూబ్ నగర్: మ్యాజిక్ ఫిగర్ 720 ఓట్లు
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ ఎన్నికలో ఓటర్లు మొదటి, రెండు, మూడో ప్రాధాన్యత ఓట్లను వేయాల్సి ఉంటుంది. మొదటి ప్రాధాన్యత ఓటు వేయకుండా రెండు, మూడో ప్రాధాన్యత ఓటు వేసినా ఆ ఓటు చెల్లదు. ఉమ్మడి జిల్లాలో 1,439 ఓట్లకు గానూ.. 1,437 ఓట్లు పోలయ్యాయి. మ్యాజిక్ ఫిగర్ 720 ఓట్లు. మొదటి ప్రాధాన్యత ఓటుగా 720 ఓట్లు ఎవరికి పోల్ అయితే వారిదే విజయం.
Similar News
News January 20, 2025
NGKL: అర్హులందరికీ సంక్షేమ పథకాలు: అడిషనల్ కలెక్టర్
బిజినేపల్లి మండల కేంద్రంలోనీ తాహశీల్దార్ కార్యాలయాన్ని ఆదివారం జిల్లా అదనపు కలెక్టర్ పి.అమరేందర్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా రైతు భరోసా సర్వే వివరాలను తహశీల్దార్ శ్రీరాములును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేవిధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీవో కథలప్ప, ఏవో నీతీ, ఎంపీఓ నరసింహులు, మండల ఏఈవోలు పాల్గొన్నారు.
News January 20, 2025
MBNR: ప్రజలు QR కోడ్ స్కాన్లను సద్వినియోగం చేసుకోవాలి: ఎస్పీ
పోలీస్ సేవల పై ప్రజలు తమ అభిప్రాయాన్ని తెలిపేందుకు ఏర్పాటు చేసినా QR కోడ్ స్కాన్లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ జానకి ప్రజలకు సూచించారు. పోలీస్ సేవలగురించి తమ అభిప్రాయం తెలిపేందుకు QR కోడ్ స్టికర్లను జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో, సర్కిల్ కార్యాలయాలలో, డీఎస్పీ కార్యాలయం, జిల్లా పోలీస్ కార్యాలయాలో అతికించామని తెలిపారు.
News January 20, 2025
MBNR: రైతు భరోసా వారికే: మంత్రి జూపల్లి
వ్యవసాయ యోగ్యమైన భూముల రైతులకే రైతు భరోసా లబ్ధి చేకూరుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. ఆదివారం HYDలో మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఇచ్చిన రైతుబంధు పథకంలో రూ.25 వేల కోట్లు దుర్వినియోగం అయ్యాయన్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకాల అమల్లో గ్రామ సభ నిర్ణయాలే కీలకం అని చెప్పారు. గ్రామ సభలో వచ్చిన అభ్యంతరాలను 10 రోజుల్లో నివృత్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి పేర్కొన్నారు.