News March 24, 2024
మహబూబ్ నగర్: విస్తరిస్తున్న క్షయ మహమ్మారి

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా క్షయ వ్యాధి వేగంగా వ్యాపిస్తోంది. 2022లో జిల్లాలో క్షయ బాధితులు 7,187 మంది ఉండగా.. 2024లో ఇప్పటి వరకు 8,612 మంది రోగులు నమోదయ్యారు. ఒక్క ఏడాదిలోనే వారి సంఖ్య 1,425 మంది పెరిగింది. ప్రభుత్వాసుపత్రుల్లో 80 శాతం కేసులు వస్తుండగా, ప్రైవేట్ ఆసుపత్రుల్లో 20 శాతం మంది చికిత్స పొందుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 17 క్షయ యూనిట్ల ఆసుపత్రులు ఉన్నాయి.
Similar News
News November 15, 2025
MBNR: ధాన్యం కేటాయింపునకు బ్యాంక్ గ్యారంటీ తప్పనిసరి

2025-26 ధాన్యం కేటాయింపుకు బ్యాంకు గ్యారంటీ తప్పనిసరి అని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో రైస్ మిల్లర్లతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో 92 రైస్ మిల్లులు ఉండగా నామమాత్రంగా కేవలం 42 రైస్ మిల్లులు మాత్రమే బ్యాంకు గ్యారెంటీని సమర్పించాయని అన్నారు. గ్యారంటీ ఇవ్వని మిల్లులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ధాన్యం కేటాయింపు జరగదన్నారు.
News November 15, 2025
MBNR: అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి దరఖాస్తులకు గడువు పెంపు

ప్రభుత్వ ఆదేశాల మేరకు అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఈనెల 19వ తేదీ వరకు గడువు విధించడం జరిగిందని జిల్లా ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు ఒక ప్రకటన ద్వారా వెలడించారు. జిల్లాలో అర్హత కలిగిన విద్యార్థులు విదేశాలలో చదువుకునేందుకు స్కాలర్షిప్ రిజిస్ట్రేషన్ సంబంధిత వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి అన్నారు. వివరాలకు 77309 09838 నంబర్ సంప్రదించాలన్నారు.
News November 15, 2025
పాలమూరు: పీయూలో యాంటీ ర్యాగింగ్ అవగాహన

పాలమూరు విశ్వవిద్యాలయం లైబ్రరీ ఆడిటోరియంలో యాంటీ ర్యాగింగ్ సెల్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు పాల్గొని విద్యార్థులు క్రమశిక్షణతో చదివి మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని, బీఎఎస్ చట్టంలోని కఠిన సెక్షన్ల గురించి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పీజీ కాలేజ్ ప్రిన్సిపల్ డా డి మధుసూదన్ రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


