News April 15, 2025
మహమ్మదాబాద్: పట్టపగలే భారీ చోరీ

MBNR జిల్లా మహమ్మదాబాద్ మండలం నంచర్ల గ్రామంలో పట్టపగలే భారీ చోరీ ఘటన కలకలం రేపుతోంది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కలిసి స్థానికుడు శివగోపాల్ నివాసానికి వచ్చారు. ఇంట్లో ఉన్న మహిళపై స్ప్రే చేసి స్పృహ కోల్పోయేలా చేసి, ఇంట్లో నుంచి రూ.6 లక్షలు, వారి దుకాణంలోని రూ.50 వేలతో పాటు మెడలోని 3 తులాల బంగారు గొలుసు ఎత్తుకెళ్లారు. సీఐ గాంధీ, ఎస్ఐ శేఖర్ వచ్చి కేసు నమోదు చేశారు.
Similar News
News November 29, 2025
ములుగు: కుమార్తె అన్న ప్రసాన.. గుండెపోటుతో తండ్రి మృతి

జిల్లాలోని కన్నాయిగూడెం మండలంలో విషాదం నెలకొంది. కంతనపల్లికి చెందిన హనుమంతరావు అనే కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి చెందాడు. స్థానికుల వివరాలు.. తన కుమార్తె అన్నప్రాసన సందర్భంగా హనుమంతరావు ద్వారక తిరుమలలో శుక్రవారం కుటుంబంతో జరుపుకొన్నాడు. అదే రోజు రాత్రి తాను నివాసం ఉంటున్న సత్తుపల్లిలో రోడ్డు పక్కన కుప్పకూలాడు. గమనించిన కుటుంబీకులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
News November 29, 2025
వీఎంఆర్డీఏ పర్యాటక ప్రాంతాల సందర్శనకు ఇంటిగ్రేటెడ్ కార్డులు

వీఎంఆర్డీఏకు చెందిన పర్యాటక ప్రాంతాల సందర్శనకు ఇంటిగ్రేటెడ్ కార్డులు ప్రవేశపెడుతున్నామని చైర్మన్ ప్రణవ్ గోపాల్ తెలిపారు. వీఎంఆర్డీఏ కార్యాలయంలో శనివారం బోర్డు సమావేశం జరిగింది. పర్యాటకుల సౌకర్యం కోసం ఈ కార్డును ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. మాస్టర్ ప్లాన్ రహదారులు, 2040 మాస్టర్ ప్లాన్, కైలాసగిరిపై అభివృద్ధి ప్రాజెక్టులు గురించి సమావేశంలో చర్చించామని తెలిపారు.
News November 29, 2025
కొత్తగూడెం: యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి పటిష్ట ఏర్పాట్లు

చారిత్రాత్మక వేడుకకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. డిసెంబర్ 2న సీఎం రేవంత్ రెడ్డి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించి చేపట్టాల్సిన చర్యలపై శనివారం యూనివర్సిటీ ఆడిటోరియంలో సమీక్ష నిర్వహించారు. ఎలాంటి లోపాలు లేకుండా పర్యటనను ప్రతి శాఖ అత్యంత సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎస్పీ, అడిషనల్ కలెక్టర్ ఉన్నారు


