News April 15, 2025

మహమ్మదాబాద్: పట్టపగలే భారీ చోరీ

image

MBNR జిల్లా మహమ్మదాబాద్ మండలం నంచర్ల గ్రామంలో పట్టపగలే భారీ చోరీ ఘటన కలకలం రేపుతోంది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కలిసి స్థానికుడు శివగోపాల్ నివాసానికి వచ్చారు. ఇంట్లో ఉన్న మహిళపై స్ప్రే చేసి స్పృహ కోల్పోయేలా చేసి, ఇంట్లో నుంచి రూ.6 లక్షలు, వారి దుకాణంలోని రూ.50 వేలతో పాటు మెడలోని 3 తులాల బంగారు గొలుసు ఎత్తుకెళ్లారు. సీఐ గాంధీ, ఎస్ఐ శేఖర్ వచ్చి కేసు నమోదు చేశారు.

Similar News

News November 27, 2025

NLG: ఇక్కడ మహిళలే కీలకం

image

సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావటంతో పల్లెల్లో ఎన్నికల సందడి మొదలైంది. ఆశావహులు ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. అయితే పురుషులతో పోలిస్తే ఉమ్మడి జిల్లాలో మహిళా ఓటర్లు 28 వేల పైచిలుకు అధికంగా ఉన్నారు. వీరిని ప్రసన్నం చేసుకుంటే గెలుపు ఖాయమని భావిస్తున్నారు. అలాగే గంపగుత్త ఓట్ల కోసం కులసంఘాల మద్దతు కూడగట్టే పనిలో పడ్డారు.

News November 27, 2025

యాదాద్రి: ఈ గ్రామాల్లో తొలిసారి ఎన్నికలు

image

యాదాద్రి జిల్లాలోని 153 సర్పంచ్, 1,286 వార్డులకు నేటి నుంచి నామినేష్లను స్వీకరించనున్నారు. అయితే జిల్లాలో నూతనంగా ఏర్పడిన ఆరు గ్రామ పంచాయతీల్లో తొలిసారి ఎన్నికలు జరగనున్నాయి. ఆలేరు మండంలోని బైరాంనగర్, సాయిగూడెం, తుర్కపల్లి మండలంలోని గుర్జవానికుంటతండా, ఇందిరానగర్, బొమ్మలరామారం మండలంలోని ఖాజీపేటకు తొలి విడతలో, మోటకొండూరు మండలంలో అబీద్‌నగర్, పెద్దబావి పంచాయతీలకు 3వ విడతలో ఎన్నికలు జరగనున్నాయి.

News November 27, 2025

నిర్మల్: పంచాయతీ పరుగులో పార్టీల పట్టు..!

image

పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు వ్యూహా, ప్రతివ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. పార్టీల పరంగా గుర్తులు లేకున్నా సంస్థాగతంగా కీలకమైన ఎన్నికల్లో పట్టు సాధించాలంటే జీపీ పాలకవర్గాలే ముఖ్యం. దీంతో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు గెలుపు గుర్రాల కోసం వెతుకున్నారు. గతంలో ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థులు, బలమైన నాయకులను కలిసి పోటీలో ఉండాలని సూచిస్తున్నారు. నిర్మల్ జిల్లాలో 400 జీపీలు, 3368 వార్డులున్నాయి.