News April 15, 2025

మహమ్మదాబాద్: పట్టపగలే భారీ చోరీ

image

MBNR జిల్లా మహమ్మదాబాద్ మండలం నంచర్ల గ్రామంలో పట్టపగలే భారీ చోరీ ఘటన కలకలం రేపుతోంది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కలిసి స్థానికుడు శివగోపాల్ నివాసానికి వచ్చారు. ఇంట్లో ఉన్న మహిళపై స్ప్రే చేసి స్పృహ కోల్పోయేలా చేసి, ఇంట్లో నుంచి రూ.6 లక్షలు, వారి దుకాణంలోని రూ.50 వేలతో పాటు మెడలోని 3 తులాల బంగారు గొలుసు ఎత్తుకెళ్లారు. సీఐ గాంధీ, ఎస్ఐ శేఖర్ వచ్చి కేసు నమోదు చేశారు.

Similar News

News April 20, 2025

తిరుపతి: 22వ తేదీన జాబ్ మేళా

image

ఎస్వీ యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ కార్యాలయం మోడల్ కెరియర్ సెంటర్ (MCC)AY 22వ తేదీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కార్యాలయ అధికారి శ్రీనివాసులు పేర్కొన్నారు. దాదాపు 14 కంపెనీల ప్రతినిధుల హాజరవుతారని తెలిపారు. పదోతరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగ అభ్యర్థులు అర్హులన్నారు. మొత్తం 800 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు.

News April 20, 2025

ఎల్&టీ సంస్థకు LOA అందించిన సీఆర్డిఏ కమిషనర్

image

అమరావతిలో శాసనసభ భవన నిర్మాణ పనులు చేసేందుకు L1గా ఎల్ & టీ సంస్థ ఎంపికైంది. ఈ మేరకు శనివారం విజయవాడలోని CRDA కార్యాలయంలో కమిషనర్ కె.కన్నబాబు ఎల్ & టీ సంస్థ ప్రతినిధులకు లెటర్ ఆఫ్ అవార్డు- LOA అందజేశారు. అమరావతిలో B+G+3 (బేస్‌మెంట్+ గ్రౌండ్+3) విధానంలో శాసనసభ భవనాలకు సంబంధించి రూ.617.33 కోట్ల పనులను ఎల్ & టీ చేపట్టనుంది.

News April 20, 2025

వరంగల్: ‘గిరికతాటి’ కల్లుకు కేరాఫ్ ‘పాకాల’

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో గిరకతాటి కల్లు ఎక్కడ దొరుకుతుందంటే ఠక్కున గుర్తొచ్చేది ఖానాపురం మండలం పాకాల. నర్సంపేట నుంచి పాకాలకు వెళ్లే దారి మధ్యలో సుమారు 60 గిరికతాటి చెట్లు ఉన్నాయి. చుట్టూ దట్టమైన అడవి, పక్కనే పాకాల వాగు వద్ద దొరికే ఈ కల్లు కోసం HYD, WGL, ఖమ్మం, కరీంనగర్ తదితర ప్రాంతాల నుంచి వస్తుంటారు. ప్రతి ఏటా వేలం పాటలో గీతకార్మికులు ఈ చెట్లను దక్కించుకుంటారు. ఇక్కడ కుండ చికెన్ కూడా ఫేమస్.

error: Content is protected !!