News April 15, 2025

మహమ్మదాబాద్: పట్టపగలే భారీ చోరీ

image

MBNR జిల్లా మహమ్మదాబాద్ మండలం నంచర్ల గ్రామంలో పట్టపగలే భారీ చోరీ ఘటన కలకలం రేపుతోంది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కలిసి స్థానికుడు శివగోపాల్ నివాసానికి వచ్చారు. ఇంట్లో ఉన్న మహిళపై స్ప్రే చేసి స్పృహ కోల్పోయేలా చేసి, ఇంట్లో నుంచి రూ.6 లక్షలు, వారి దుకాణంలోని రూ.50 వేలతో పాటు మెడలోని 3 తులాల బంగారు గొలుసు ఎత్తుకెళ్లారు. సీఐ గాంధీ, ఎస్ఐ శేఖర్ వచ్చి కేసు నమోదు చేశారు.

Similar News

News November 11, 2025

అయిజ: ‘చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి’

image

విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని బాస్కెట్‌బాల్ అసోసియేషన్ గద్వాల జిల్లా అధ్యక్షులు రామచంద్రారెడ్డి, SI తరుణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అయిజ మండలం ఉత్తనూర్ ZPHS ప్రాంగణంలో మంగళవారం SGF జిల్లాస్థాయి అండర్-14, అండర్-17 బాస్కెట్‌బాల్ క్రీడాపోటీలు నిర్వహించారు. జిల్లాలోని వివిధ మండలాల పాఠశాలల విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ప్రతిభ కనబరిచిన వారిని జోనల్ స్థాయి పోటీలకు ఎంపికచేశారు.

News November 11, 2025

రాంబిల్లి: 106 ఎకరాల్లో రూ.1175 కోట్లతో పరిశ్రమ

image

బాలాజీ యాక్షన్ బిల్డ్ వెల్ ప్రైవేట్ లిమిటెడ్ సుమారు 106 ఎకరాల విస్తీర్ణంలో రూ.1175 కోట్ల పెట్టుబడితో పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ ఛైర్మన్ ఎన్.కె అగర్వాల్ చెప్పారు. ఈ ప్రాజెక్ట్ రాంబిల్లి మండలంలో కృష్ణంపాలెంలో మంగళవారం ఆయన పర్యటించారు. వచ్చే సంవత్సరంలో దీపావళి నాటికి రూ.605 కోట్లతో ఫేజ్-1 పూర్తి కానుంది. ఈ పరిశ్రమ ద్వారా సుమారు 3000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు.

News November 11, 2025

ఢిల్లీ బ్లాస్ట్ సూసైడ్ అటాక్ కాదా?

image

ఢిల్లీ బ్లాస్ట్ సూసైడ్ అటాక్ కాదని, భయాందోళనలో తొందరపడి చేసిన దాడిగా దర్యాప్తు సంస్థలు ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు ANI పేర్కొంది. ‘టెర్రర్ నెట్‌వర్క్స్‌పై దాడుల నేపథ్యంలో ఆ ఒత్తిడిలో ఇలా చేసి ఉండొచ్చు. నిందితుడు రెగ్యులర్ సూసైడ్ బాంబింగ్ పాటర్న్ ఫాలో కాలేదు. ఇంటెన్షనల్‌గా దేనిని ఢీకొనలేదు. పూర్తిగా డెవలప్ కాని బాంబును వాడటంతో తీవ్రత తగ్గింది’ అని దర్యాప్తు అధికారులు భావిస్తున్నట్లు తెలిపింది.