News February 10, 2025

మహాదేవపూర్: చెరువులో పడి వ్యక్తి మతి

image

చెరువులో పడి వ్యక్తి మృతిచెందిన ఘటన మహాదేవపూర్ మండలంలో జరిగింది. పోలీసుల కథనమిలా.. మండల కేంద్రంలోని ఎర్రచెరువుకు మేడం నాగేందర్ (46) బహిర్భూమి కోసం వెళ్లాడు. ప్రమాదవశాత్తు చెరువులో పడి మరణించాడు. మృతుడిది హనుమకొండ జిల్లా హసన్‌పర్తి అని తెలిపారు. మృతుడి భార్య అనితా ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

Similar News

News February 28, 2026

TTD బడ్జెట్ రూ.5,400 కోట్లు

image

తిరుమల అన్నమయ్య భవన్‌లో నేడు TTD బోర్డు మీటింగ్ జరగనుంది. వార్షిక బడ్జెట్ రూ.5,400 కోట్లు ప్రతిపాదనపై చర్చ జరగనుంది. విద్యా ప్రమాణాలు పెంపు, వకుళామాత ఆలయంలో అక్షరాభ్యాసం, భద్రతా సిబ్బంది నియామకం, లగేజీ తనిఖీ కోసం ఎక్స్ రే బ్యాగేజీ, 51 మంది అర్చకుల ప్రమోషన్ తదితర 87 అంశాలతో మీటింగ్ జరగనుంది. వీటిపై కీలక నిర్ణయం తీసుకోనుంది.

News February 28, 2026

APPLY NOW: BSNLలో 120 పోస్టులు

image

<>BSNL<<>>లో 120 Sr. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ(టెలికామ్, ఫైనాన్స్) పోస్టులకు అప్లై చేయడానికి మార్చి 7 వరకు అవకాశం ఉంది. పోస్టును బట్టి BE/BTech (EE & టెలికమ్యూనికేషన్స్/ఎలక్ట్రానిక్స్/CS/IT/ఎలక్ట్రికల్/ఇన్‌స్ట్రుమెంటేషన్), CA/CMA అర్హత గల వారు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు సవరణ మార్చి 8 – 15 వరకు చేసుకోవచ్చు. వయసు 21- 30ఏళ్ల మధ్య ఉండాలి. మార్చి 29న రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు. సైట్: bsnl.co.in/

News February 28, 2026

శనగ పంటలో శనగపచ్చ పురుగు నివారణ ఎలా?

image

ప్రస్తుతం శనగ పంట చాలా చోట్ల పూత, కాయ దశలో ఉంది. ఈ సమయంలో శనగపచ్చ పురుగులు కాయలను ఆశించి గుండ్రటి రంధ్రాలను చేసి తల లోపలికి పెట్టి గింజలను తిని అధిక నష్టం కలిగిస్తాయి. వీటి నివారణకు దీపపు ఎరలతో పాటు ఎకరాకు 8-10 పక్షి స్థావరాలను ఏర్పాటు చేయాలి. లింగాకర్షక ఎరలను ఉంచాలి. చీడలను ఆశించే మొక్కలను తొలగించి కాల్చివేయాలి. లీటరు నీటికి క్లోరిపైరిఫాస్ 2.5ML లేదా క్వినాల్ ఫాస్ 2ML కలిపి పిచికారీ చేయాలి.