News April 3, 2025

మహాదేవపూర్: పెచ్చులూడుతున్న క్యూలైన్ గోడలు

image

మహాదేవపూర్ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన కాళేశ్వరం దేవస్థానంలో క్యూలైన్ గోడలు పెచ్చులూడి భక్తులను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. సరస్వతి పుష్కరాలు సమీపిస్తున్న వేళ భక్తుల రద్దీ పెరిగి ఈ క్యూలైన్ ద్వారానే స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉందని భక్తులు తెలుపుతున్నారు. ఇప్పటికైనా ఆలయ అధికారులు పెచ్చులూడుతున్న ప్రాంతాలను మరమ్మతులు చేపించి ప్రమాదాలు జరగకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు.

Similar News

News November 10, 2025

హజ్ యాత్రపై సౌదీతో ఒప్పందం.. భారత్ కోటా ఎంతంటే..

image

హజ్ యాత్రకు సంబంధించి భారత్, సౌదీ అరేబియా మధ్య ద్వైపాక్షిక ఒప్పందం కుదిరింది. 2026 సంవత్సరానికి గాను భారత్ కోటా కింద 1,75,025 మంది యాత్రికులకు అనుమతివ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు జెడ్డాలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, సౌదీ మంత్రి తౌఫిక్ అగ్రిమెంట్‌పై సంతకాలు చేశారు. హజ్ ఏర్పాట్ల గురించి వీరిద్దరూ సమీక్షించారు. కోఆర్డినేషన్, రవాణా మద్దతు, తీర్థయాత్ర సజావుగా సాగడం వంటి అంశాలపై చర్చించారు.

News November 10, 2025

సీతారాంపురం గ్రామంలో టిప్పర్‌ బీభత్సం

image

ములకలపల్లి మండలం సీతారాంపురం గ్రామంలో సోమవారం తెల్లవారుజామున అతివేగంతో దూసుకొచ్చిన ఓ టిప్పర్‌ బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన ఉన్న కుట్టు మిషన్ల యూనిట్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో షెడ్లు, యంత్రాలు ధ్వంసమయ్యాయి. తెల్లవారుజాము కావడంతో యూనిట్‌లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రాణాపాయం తప్పింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News November 10, 2025

ఖమ్మం: ఉపాధ్యాయుల హాజరుపై ‘యాప్’ కొరడా!

image

ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు కోసం ప్రవేశపెట్టిన FARS యాప్ ఇప్పుడు ఉపాధ్యాయులపై నిఘా పెట్టింది. హాజరు తక్కువ ఉన్న హెచ్‌ఎంలను కలెక్టర్ మందలించారు. సక్రమంగా హాజరుకాని టీచర్లకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. సమయపాలన, సెలవు/ఓడీ అప్‌డేట్‌ యాప్‌లో తప్పనిసరి. ఈ కఠిన నిబంధనలపై ఉపాధ్యాయ సంఘాలు గుర్రుగా ఉన్నాయి.