News March 18, 2025
మహానందిలో విషాదం.. ఒకరు మృతి

మహానంది దేవస్థానంలో ఉన్న నాగనంది సదనం ఆవరణలో వసతి గృహాలను కూలుస్తున్న సమయంలో విషాదం చోటుచేసుకుంది. నూతనంగా 50 వసతి గృహాల సముదాయం కోసం ప్రస్తుతం ఉన్న వసతి గృహాలను తొలగిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కూల్చివేత పనులు చేస్తుండగా పెళ్లలు పడి నంద్యాల మండలం పెద్ద కొట్టాలకు చెందిన రాముడు అక్కడికక్కడే మృతిచెందాడు. వెంకటేశ్వర్లు తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 24, 2025
ఆలయ నిర్మాణాలకు దరఖాస్తులు చేసుకోండి: AC

TTD శ్రీవాణి ట్రస్ట్ నిధులతో గ్రామాల్లో భజన మందిరాల నిర్మాణం కోసం దరఖాస్తులు చేసుకోవాలని దేవాదాయ శాఖ విజయనగరం జిల్లా AC శిరీష ఇవాళ ఒక ప్రకటనలో తెలిపారు. నిర్మాణ స్థలం ఆధారంగా మందిరాలను టైప్ A, B, Cలుగా విభజించి రూ.10 లక్షల నుండి రూ.20 లక్షల వరకు నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. స్థల వివరాలు, యజమాని NOCను జతచేసి, దరఖాస్తులను తోటపాలెంలో ఉన్న దేవాదాయ శాఖ కార్యాలయానికి అందజేయాలన్నారు.
News November 24, 2025
BHPL: 61 దరఖాస్థులను స్వీకరించిన అదనపు కలెక్టర్

ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్థుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. సోమవారం ఐడీవోసీలో అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి, ప్రజల నుంచి 61 దరఖాస్థులను ఆయన స్వీకరించారు. ప్రజావాణి దరఖాస్థులు పెండింగ్ ఉంచకుండా సత్వర పరిష్కారం కల్పనకు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
News November 24, 2025
రామసముద్రం యువతి బెంగళూరులో దారుణ హత్య

అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలానికి చెందిన విద్యార్థిని బెంగళూరులో హత్యకు గురైన ఘటన సోమవారం వెలుగు చూసింది. స్థానికుల వివరాల ప్రకారం.. రామసముద్రం (M) బిక్కంగారిపల్లికి చెందిన దేవిశ్రీ (21) బెంగళూరులో BBA చదువుతోంది. ఈ క్రమంలో విద్యార్థితో చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం పెద్ద కొండామర్రికి చెందిన ప్రేమ్ వర్ధన్ పరిచయం పెంచుకున్నాడు. వారి మధ్య ఏం జరిగిందో తెలిదు.. నిన్న రాత్రి హత్య చేసి పరారయ్యాడు.


