News March 18, 2025

మహానందిలో విషాదం.. ఒకరు మృతి

image

మహానంది దేవస్థానంలో ఉన్న నాగనంది సదనం ఆవరణలో వసతి గృహాలను కూలుస్తున్న సమయంలో విషాదం చోటుచేసుకుంది. నూతనంగా 50 వసతి గృహాల సముదాయం కోసం ప్రస్తుతం ఉన్న వసతి గృహాలను తొలగిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కూల్చివేత పనులు చేస్తుండగా పెళ్లలు పడి నంద్యాల మండలం పెద్ద కొట్టాలకు చెందిన రాముడు అక్కడికక్కడే మృతిచెందాడు. వెంకటేశ్వర్లు తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 21, 2025

HYD: నగరంలో పెరుగుతున్న చలి తీవ్రత

image

హైదరాబాద్‌లో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. కొన్ని ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా చలి రికార్డు సృష్టిస్తోంది. పటాన్‌చెరులో కనిష్ఠ ఉష్ణోగ్రతలు గురువారం సాధారణం కంటే 6.4 తక్కువగా నమోదైంది. రాజేంద్రనగర్‌లో 11.5, హయత్‌నగర్‌లో 12.6 నమోదు కాగా, సగటున గరిష్ఠ ఉష్ణోగ్రత 29.4, కనిష్ఠ ఉష్ణోగ్రత 13.1 డిగ్రీలుగా నమోదైంది.

News November 21, 2025

కామారెడ్డి: కస్తూర్బా విద్యార్థినికి పాముకాటు

image

రాజంపేటలోని కస్తూర్బా పాఠశాల విద్యార్థినికి పాముకాటుకు గురైంది. గమనించిన తోటి విద్యార్థులు, సిబ్బంది ప్రిన్సిపల్ శ్రీవాణికి చెప్పారు. దీంతో ఆమెను హుటాహుటిన కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న డీఈఓ రాజు అమ్మాయిని పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. ఆమెకు ఎలాంటి ప్రాణాపాయం లేదని ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు.

News November 21, 2025

అక్టోబర్‌లో ట్యాక్స్ రెవెన్యూ రూ.16,372 కోట్లు

image

TG: అక్టోబర్‌లో రాష్ట్ర ఖజానాకు అన్ని రకాల పన్నుల కింద రూ.16,372.44 కోట్లు సమకూరినట్లు కాగ్ నివేదిక వెల్లడించింది. ఎక్సైజ్ సుంకాల ద్వారానే రూ.3,675Cr వచ్చినట్లు పేర్కొంది. అక్టోబర్ రెవెన్యూతో కలిపి ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఖజానాకు చేరిన మొత్తం రూ.88,209.10Crకు పెరిగింది. FY26లో పన్నుల కింద మొత్తం రూ.1,75,319.35Cr వస్తాయని ప్రభుత్వం అంచనా వేయగా, ఇప్పటివరకు 50.31% సమకూరింది.