News January 25, 2025

మహానందిలో 1.20లక్షల లడ్డూలు సిద్ధంగా ఉంచుతాం: ఈవో

image

మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా గత ఏడాది 1,10,000 లడ్డూ ప్రసాదాలు విక్రయించామని మహానంది ఈవో శ్రీనివాసరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీ మేరకు లడ్డు, పులిహోర ప్రసాదాలు సరిపడా అందుబాటులో ఉంచుతామన్నారు. ఆలయానికి వచ్చే భక్తుల కోసం 1,20,000 లడ్డూలు అందుబాటులో ఉంచుతామని చెప్పారు. అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రసాదాలు విక్రయిస్తామన్నారు.

Similar News

News November 28, 2025

పీఎంఏవై గ్రామీణ సర్వే పూర్తి: కలెక్టర్ కీర్తి

image

పీఎంఏవై గ్రామీణ 2.0 పథకం కింద ఇళ్లు లేని పేదల గుర్తింపు గడువు నవంబర్ 30 వరకు ఉండటంతో, జిల్లాలో 16,335 మంది అర్హులైన లబ్ధిదారులను గుర్తించినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి శుక్రవారం తెలిపారు. గృహనిర్మాణ శాఖ సిబ్బంది ద్వారా ‘ఆవాస్ ప్లస్’ యాప్‌లో సర్వే పూర్తి చేసినట్లు ఆమె ప్రకటించారు. అర్హత కలిగి, ఆసక్తి ఉన్నవారు నవంబర్ 30లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

News November 28, 2025

జగిత్యాల: ఎన్నికల నిఘాకు ఫ్లయింగ్ స్క్వాడ్ వాహనాల ప్రారంభం

image

కలెక్టరేట్ ఆడిటోరియంలో ఎన్నికల విధులకు సంబంధించిన 3 ఎస్‌ఎస్‌టీ, 20 ఎఫ్‌ఎస్‌టీ బృందాలకు అవగాహన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఎన్నికల నిబంధనలు, స్క్వాడ్‌ల కార్యాచరణ, అనుసరించాల్సిన విధానాలపై వివరాలు అందించారు. అనంతరం జగిత్యాల జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ కలెక్టరేట్ ఆవరణలో ఫ్లయింగ్ స్క్వాడ్ వాహనాలను జెండా ఊపి ప్రారంభించి బృందాలను విధులకు తరలించారు.

News November 28, 2025

జగిత్యాల: ఫ్లయింగ్ స్క్వాడ్ పనితీరుపై 24 గంటల నిఘా

image

ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని, జీపీఎస్ ట్రాక్ సిస్టమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తామని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. సంఘటనలు జరిగినప్పుడు సీసీ కెమెరాల ఆధారంగా పరిశీలిస్తామని చెప్పారు. మద్యం, లిక్కర్, నగదు పట్టుబడితే వీడియో రికార్డింగ్ తప్పనిసరిగా చేయాలని సూచించారు. సీజ్ చేసిన నగదును కోర్టుకు పంపించాలి, ఎఫ్‌ఐఆర్ లేనివి గ్రీవెన్స్ సెల్‌కు అప్పగించాలన్నారు.