News September 23, 2024

మహానంది ఆలయ డిప్యూటీ కమిషనర్‌గా శోభారాణి

image

మహానంది డిప్యూటీ కమిషనర్‌గా రాష్ట్ర దేవదాయశాఖ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న డీసీ.శోభారాణిని నియమిస్తూ దేవదాయశాఖ కమిషనర్ సత్యనారాయణ ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం మహానంది ఈవోగా పనిచేస్తున్న శ్రీనివాసరెడ్డికి పల్నాడు జిల్లాలోని అమరేశ్వరస్వామి దేవస్థానం ఈవోగా బదిలీ చేశారు.

Similar News

News February 28, 2026

ప్రభుత్వ పథకాల ప్రచారాన్ని విస్తరించాలి: కలెక్టర్

image

ప్రభుత్వ పథకాలపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించేలా సమర్థవంతంగా ప్రచారం చేయాలని కర్నూలు కలెక్టర్ సిరి అధికారులను ఆదేశించారు. సమాచార శాఖ రూపొందించిన ‘స్వర్ణాంధ్ర@2047’ క్యాలెండర్‌ను కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. జిల్లాలో జీడీపీ, తలసరి ఆదాయం పెంచేందుకు శాఖలు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని, వ్యవసాయం, పశుసంవర్థకం, డ్రిప్ ఇరిగేషన్ రంగాల్లో రైతుల ఆదాయం పెంపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

News February 27, 2026

358 మంది విద్యార్థుల గైర్హాజరు

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం జరిగిన ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలకు 358 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి (RIO) లాలప్ప తెలిపారు. మొత్తం 5,069 మంది విద్యార్థులకు గానూ 4,711 మంది పరీక్షకు హాజరయ్యారని వెల్లడించారు. జిల్లాలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని, పరీక్షలు అత్యంత ప్రశాంత వాతావరణంలో ముగిశాయని ఆయన పేర్కొన్నారు.

News February 27, 2026

‘కర్నూలు జిల్లాలో పుష్కలంగా ఎరువుల నిల్వలు’

image

2025-26 రబీ సీజన్‌కు సంబంధించి కర్నూలు జిల్లాలో ఎరువుల కొరత లేదని, అన్ని రకాల ఎరువులు అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి తెలిపారు. జిల్లా అవసరాల కోసం 24,580 మెట్రిక్ టన్నుల యూరియా అంచనా వేయగా, ప్రస్తుతం 25,635 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన నానో యూరియా, నానో డీఏపీ కూడా అందుబాటులో ఉందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.