News February 17, 2025

మహానందీశ్వరుని కళ్యాణం.. LATEST PHOTO

image

మహానంది శ్రీ గంగా, శ్రీ కామేశ్వరీ దేవి సమేత శ్రీ మహానందీశ్వర స్వామి దంపతులకు ఆదివారం వైభవంగా నిత్య కళ్యాణం నిర్వహించారు. ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వేదపండితులు రవిశంకర్ అవధాని, పండితులు, అర్చకులు అలంకార మండపంలో స్వామి, అమ్మవారి ఉత్సవ మూర్తులను విశేషంగా అలంకరించారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, మాంగళ్య ధారణ, అక్షింతలు సమర్పణ పూజలు శాస్త్రోక్తంగా చేశారు.

Similar News

News November 6, 2025

WGL: క్వింటా పసుపు రూ.11,738

image

చాలా రోజుల అనంతరం వరంగల్ ఎనుమాముల మార్కెట్‌కు గురువారం పసుపు తరలివచ్చింది. ఈ క్రమంలో క్వింటా పసుపుకు రూ.11,738 ధర వచ్చింది. అలాగే మొక్కజొన్న సైతం తరలిరాగా రెండు రోజులతో పోలిస్తే ధర భారీగా పడిపోయింది. సోమవారం మక్కలు (బిల్టీ) క్వింటాకి రూ.2,095, మంగళవారం రూ.2,055 ధర వస్తే.. ఈరోజు రూ.2,010 కి పతనమైంది. అలాగే దీపిక మిర్చి రూ.15,500 ధర వచ్చింది.

News November 6, 2025

తెలంగాణ న్యూస్ అప్‌డేట్స్ @2PM

image

*రేపు జరగాల్సిన క్యాబినెట్ మీటింగ్ ఈ నెల 12కు వాయిదా
*హైదరాబాద్ బోరబండలో బండి సంజయ్ కార్నర్ మీటింగ్‌కు అనుమతి రద్దు చేశారంటూ బీజేపీ నేతల ఆందోళన.. సభ జరిపి తీరుతామని స్పష్టం
*జూబ్లీహిల్స్‌లో 3 పార్టీల మధ్య గట్టి పోటీ ఉందన్న కిషన్ రెడ్డి
*ఫిరాయింపు MLAలు తెల్లం వెంకట్రావు, సంజయ్‌లను నేడు విచారించనున్న స్పీకర్ గడ్డం ప్రసాద్

News November 6, 2025

5 గంటలకు చెరువుకు గండి: తిరుపతి SP

image

<<18214583>>చెరువుకు గండి<<>> పడిన వెంటనే పోలీసులు, గ్రామస్థులు సమన్వయంతో పనిచేయడంతో ప్రాణ నష్టం జరగలేదని తిరుపతి SP సుబ్బరాయుడు తెలిపారు. రాయలచెరువు ముంపు ప్రాంతాల్లో SP గురువారం పర్యటించారు. బాధితుల సమస్యలు తెలుసుకున్నారు. ‘ఉదయం 5 గంటల సమయంలో గండి పడింది. దాదాపు 500 ఇళ్లు నీటమునిగే పరిస్థితులు ఏర్పడినా సమయోచిత చర్యలతో ప్రజలను సురక్షితంగా తరలించాం. పశువుల నష్టం జరిగిన చోట తక్షణ చర్యలు చేపట్టాం’ అని SP చెప్పారు.