News April 15, 2025
మహారాజ్ బావోజీ బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న సత్యవతి రాథోడ్

మహబూబాబాద్ జిల్లా బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కొడంగల్లోని భూనీడ్ శ్రీ గురు లోక్ ప్రభు మహారాజ్ బావోజీ జాతర బ్రహ్మోత్సవాల్లో సోమవారం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. బావోజీ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. అనంతరం కొడంగల్లో బీఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశంలో మాట్లాడుతూ.. ఈనెల 27న ఎల్కతుర్తి ఆవిర్భావ సభను విజయవంతం చేయాలన్నారు.
Similar News
News December 18, 2025
‘బ్రహ్మపుత్ర’పై చైనా డ్యామ్.. భారత్కు ముప్పు!

యార్లంగ్ త్సాంగ్పో (బ్రహ్మపుత్ర) నదిపై $168B (సుమారు రూ.1,51,860CR)తో చైనా నిర్మిస్తున్న భారీ జలవిద్యుత్ ప్రాజెక్ట్ భారత్కు ఆందోళన కలిగిస్తోంది. ఈ నది కోట్లాది మందికి జీవనాధారంగా ఉంది. సుమారు 2KM ఎత్తును ఉపయోగించుకుని విద్యుత్ ఉత్పత్తి చేసే ఈ ప్రాజెక్ట్ వల్ల నది సహజ ప్రవాహం మారే ప్రమాదం ఉంది. దీంతో వ్యవసాయంపై ప్రభావం పడే అవకాశముంది. అలాగే భవిష్యత్తులో నీటిని ఆయుధంగానూ ఉపయోగించే ప్రమాదముంది.
News December 18, 2025
ఖమ్మం: మూడో దశ పోరులో పైచేయి ఎవరిదంటే?

● సత్తుపల్లి(21 స్థానాలు): CON- 16, BRS- 4, TDP- 1
● ఏన్కూర్(20): CON- 16, BRS- 3, ఇతరులు- 1
● తల్లాడ(27): CON- 19, BRS- 6, CPM- 1, ఇతరులు- 1
● కల్లూరు(23): CON- 8, BRS- 11, ఇతరులు- 4
● సింగరేణి(41): CON- 32, BRS- 2, CPI- 1, ఇతరులు- 6
● పెనుబల్లి(32): CON- 23, BRS- 8, ఇతరులు- 1
● వేంసూరు(26): CON- 15, BRS- 10, CPM- 1.
News December 18, 2025
పరిషత్ పోరుకు ‘ఓడిన’ అభ్యర్థులు ‘సై’..!

గ్రామపంచాయతీ ఎన్నికల కోలాహలం ముగియడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అప్పుడే పరిషత్ సెగ మొదలైంది. పంచాయతీ పోరులో చేదు అనుభవం ఎదురైన అభ్యర్థులు ఇప్పుడు MPTC, ZPTC స్థానాలపై కన్నేశారు. త్వరలోనే ఈ ఎన్నికలు ఉంటాయన్న ప్రచారంతో ఉమ్మడి జిల్లాలోని 556 ఎంపీటీసీ, 66 జడ్పీటీసీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వీరు పావులు కదుపుతున్నారు. గ్రామీణ రాజకీయాల్లో పట్టు నిలుపుకునేందుకు ఇప్పట్నుంచే రంగంలోకి దిగుతున్నారు.


