News December 18, 2024

మహాలక్ష్మీ పథకానికి అప్లై చేసుకోండి: కలెక్టర్ త్రిపాఠి 

image

తెల్లరేషన్ కార్డు ఉండి మహాలక్ష్మి పథకం కింద రూ.500 ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ పథకానికి గతంలో అప్లై చేయని వారు మళ్లీ అప్లై చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఎంపీడీవో కార్యాలయంలో ప్రజాపాలన సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని లబ్ధిదారులకు సూచించారు. దరఖాస్తుతో పాటు, ఎల్పీజీ వినియోగదారు నంబరు, ఆధార్ కార్డు వివరాలు, జిరాక్స్, ఎల్పీజీ గుర్తింపు ధ్రువపత్రాలతో అప్లై చేయాలన్నారు. 

Similar News

News February 5, 2025

నల్గొండ: రోడ్డుప్రమాదంలో యువకుడి మృతి 

image

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన తిప్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని హ్యాపీ హోమ్స్ కాలనీ సమీపంలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా.. కేశరాజుపల్లికి చెందిన మేకల మహేశ్ (25) పొలం వద్దకు వెళ్లి వస్తున్నాడు. ఈ క్రమంలో హ్యాపీ హోమ్స్ సమీపంలో బైక్ అదుపుతప్పి కరెంటు స్తంభానికి ఢీకొంది. దీంతో తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

News February 5, 2025

చెర్వుగట్టులో కట్నాల రాబడి రూ.8.89 లక్షలు

image

చెర్వుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం తెల్లవారుజామున శ్రీ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణంలో భక్తులు సమర్పించిన కట్నాలు సాయంత్రం 4 గంటల వరకు లెక్కించగా రూ.8,89,445లు వచ్చినట్లు కార్యనిర్వహణ అధికారి నవీన్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ కృష్ణ, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ భాస్కర్ పాల్గొన్నారు.

News February 5, 2025

నల్గొండ: మోటర్ ఆన్ చేస్తుండగా విద్యుత్ షాక్ 

image

కనగల్ మండలంలో జీ.యడవల్లిలో విషాదం జరిగింది. విద్యుత్ షాక్‌కు గురై రైతు మృతిచెందాడు. హెడ్ కానిస్టేబుల్ ఎంఏ రషీద్ ఖాన్ తెలిపిన వివరాలిలా.. గ్రామానికి చెందిన మన్నెం గోపి(32) ఉదయం 11 గంటల సమయంలో పొలానికి వెళ్లాడు. పొలం వద్ద బోరు మోటర్‌ను ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై మృతిచెందాడు. మృతుడి తండ్రి యాదయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

error: Content is protected !!