News February 27, 2025
మహాశివరాత్రి.. రామప్పలో నేటి కార్యక్రమాలు ఇవే

రామప్ప దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా రెండవ రోజు ఉదయం అభిషేకంతో ప్రారంభమై, వీరభద్ర పల్లెరము, భద్రకాళి పూజ, నిత్య పూజలు జరగనున్నాయి. శుక్రవారం తెల్లవారుజామున అగ్ని గుండాలలో నడుచుట కార్యక్రమాలతో రెండో రోజు కార్యక్రమాలు ముగియనున్నాయి. రెండవ రోజు భక్తుల సౌకర్యార్థము ఆర్టీసీ బస్సులను నడపనున్నారు.
Similar News
News January 10, 2026
పోలీస్ బ్యారెక్స్ గ్రౌండ్లో 17న తుక్కు వేలం

విశాఖలో పోలీస్ స్టేషన్లు, విభాగాలు నుంచి సేకరించిన నిరుపయోగమైన ఇనుము, అల్యూమినియం, చెక్క, ప్లాస్టిక్ వస్తువులు జనవరి 17న వేలం వేయనున్నట్లు విశాఖ సీపీ కార్యాలయం నుంచి శనివారం ప్రకటన విడుదల చేశారు. ఆరోజు ఉదయం 10 గంటలకు బహిరంగ వేలం వేయనున్నట్లు తెలిపారు. ఆసక్తిగల వారు జనవరి 12 ఉదయం 10 నుంచి వస్తువులను చూసుకొనవచ్చన్నారు. వేలంలో పాల్గొనే వారు పోలీస్ బ్యారెక్స్, కార్యాలయంలో రిజిస్టర్ చేయించుకోవాలన్నారు.
News January 10, 2026
48 డ్రైవర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

పోస్టల్ డిపార్ట్మెంట్లో 48 కార్ డ్రైవర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నారు. అహ్మదాబాద్ ప్రాంతంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. టెన్త్ పాసై, డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన అభ్యర్థులు జనవరి 19 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18నుంచి 27ఏళ్లు మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్ల్ సడలింపు ఉంది. నెలకు జీతం రూ.19,900-63,200 చెల్లిస్తారు. వెబ్సైట్: https://www.indiapost.gov.in/
News January 10, 2026
సకల సంపదలు ప్రసాదించే సంపత్కరీ దేవి

లలితాదేవి గజ దళానికి అధిపతి అయిన సంపత్కరీ దేవి భక్తులకు ఐహిక, ఆధ్యాత్మిక సంపదలను అనుగ్రహించే కరుణామయి. అంకుశ స్వరూపిణి అయిన ఈ తల్లి, ఏనుగు అహంకారాన్ని అణచినట్లుగా మనలోని అజ్ఞానం, అహంకారాన్ని తొలగిస్తుంది. ఎంతటి పేదరికంలో ఉన్నవారికైనా సౌఖ్యాలను, విజయాలను చేకూర్చడం ఈ దేవి ప్రత్యేకత. కణ్వ మహర్షి బోధించిన ఈ దేవిని నిత్యం ప్రార్థిస్తే శత్రువులపై విజయం, అంతులేని ఐశ్వర్యం, మనశ్శాంతి లభిస్తాయని నమ్మకం.


