News January 29, 2025
మహా కుంభమేళా తొక్కిసలాట భయానకం: HYD వాసి

యూపీ మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాట భయానకంగా ఉందని, అంతా గందరగోళం నెలకొందని మేడ్చల్ జిల్లా జవహర్నగర్ మార్కండేయ స్వామి గుడి పూజారి నాగభూషణం శర్మ తెలిపారు. ఆయన కుంభమేళాలో పాల్గొనేందుకు ప్రయాగరాజ్ వెళ్లారు. అక్కడ నుంచి తన అనుభవాన్ని ఫోన్లో Way2Newsప్రతినిధితో పంచుకున్నారు. అమావాస్య కావడంతో అర్ధరాత్రి తర్వాత స్నానాలఘాట్ వద్దకు భారీగా జనం రాగా తొక్కిసలాట జరిగిందన్నారు. తాము క్షేమంగా ఉన్నామన్నారు.
Similar News
News February 13, 2025
RCB కెప్టెన్గా రజత్ పాటిదార్?

IPL-2025 సీజన్కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇవాళ తమ కెప్టెన్ను ప్రకటించనుంది. రజత్ పాటిదార్ను కెప్టెన్గా ఖరారు చేసినట్లు క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. గత ఏడాది సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పాటిదార్ కెప్టెన్గా మెప్పించారు. మధ్యప్రదేశ్ జట్టును ఫైనల్కు చేర్చారు. 2021 నుంచి RCBకి ఆడుతున్నారు. కాగా కోహ్లీ తిరిగి RCB కెప్టెన్సీ బాధ్యతలు చేపడతారని గత కొంతకాలంగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.
News February 13, 2025
రజినీకాంత్పై RGV కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్

రజినీకాంత్పై రామ్ గోపాల్ వర్మ చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. ‘క్యారెక్టర్ను బట్టి నటన ఉంటుంది. పర్ఫార్మెన్స్ ఆధారంగా స్టార్లవుతారు. రెండింటి మధ్య చాలా తేడా ఉంది. రజినీ గొప్ప నటుడా? నాకు తెలిసి భిఖు మాత్రే పాత్రను(సత్యలో మనోజ్ బాజ్పేయి) ఆయన చేయలేడు. ఆయన ఏం చేయకపోయినా స్లో మోషన్లో నడిచొస్తే చాలు ప్రేక్షకులు చూస్తారు’ అని ఓ ఇంటర్వ్యూలో RGV అన్నారు. దీంతో ఆయనపై రజినీ ఫ్యాన్స్ ఫైరవుతున్నారు.
News February 13, 2025
చేగుంట: తండ్రి మందలించడంతో కొడుకు సూసైడ్

చేగుంట మండలం వడియారం గ్రామంలో మద్యం తాగొద్దని తండ్రి మందలించడంతో పురుగు మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ చైతన్యకుమార్ రెడ్డి తెలిపారు. ఘన బోయిన శివకుమార్ అలియాస్ శివుడు(30) నిన్న రాత్రి మద్యం తాగి ఇంటికి రాగా తండ్రి మందలించాడు. దీంతో శివుడు ఇంట్లోంచి బయటకు వెళ్లి పురుగు మందు తాగడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం మరో ఆసుపత్రికి తరలిస్తుండగా ఇవాళ మృతి చెందాడు.