News November 28, 2024
మహిళతో అసభ్య ప్రవర్తన.. నంద్యాల వ్యక్తికి జైలు శిక్ష

నంద్యాలకు చెందిన ఎస్.కరీముల్లా అనే వ్యక్తి మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో అతనిపై కేసు నమోదు చేసినట్లు నంద్యాల 1వ పట్టణ సీఐ జి.సుధాకర్ రెడ్డి తెలిపారు. నిందితుడిని సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచగా 7 రోజుల జైలు శిక్ష విధించినట్లు పేర్కొన్నారు. మహిళలు, బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ సుధాకర్ రెడ్డి హెచ్చరించారు.
Similar News
News February 9, 2026
కర్నూలు: ‘37 ఏళ్ల తర్వాత ఒక్కటయ్యారు’

కర్నూలు(D) వెల్దుర్తి జడ్పీ హైస్కూల్ (1988-89 బ్యాచ్) 10వ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. దాదాపు 100 మంది పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. అప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఆనందంగా గడిపారు. అలాగే పలు కారణాలతో మృతి చెందిన మిత్రులకు మౌనం పాటించి, నివాళులర్పించారు. వివిధ రంగాల్లో స్థిరపడిన మిత్రులను ఘనంగా సన్మానించారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువులు స్మరించున్నారు.
News February 9, 2026
కర్నూలు: టెన్త్ అర్హతతో ఉద్యోగాలు.. రేపు ఇంటర్వ్యూ!

ఎమ్మిగనూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈనెల 10న (మంగళవారం) జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి ఆనంద్ రాజ్ కుమార్ తెలిపారు. 11 కంపెనీలు పాల్గొంటాయన్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, ఫార్మసీ చదివిన వారు అర్హులని పేర్కొన్నారు. వయసు 18-35 ఏళ్ల మధ్య ఉండాలన్నారు. ఉదయం 10 గంటల నుంచి ఇంటర్వ్యూలు ప్రారంభమవుతాయని చెప్పారు.
News February 9, 2026
103 మంది విద్యార్థులు హాజరు కాలేదు: లాలప్ప

జిల్లా వ్యాప్తంగా 61 పరీక్షా కేంద్రాలలో ఆదివారం జరిగిన ఇంటర్ జనరల్, ఒకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి లాలప్ప వెల్లడించారు. ఉదయం జరిగిన ప్రథమ సంవత్సరంలో 2,721 మంది విద్యార్థులు హాజరవ్వగా.. 82 మంది గైర్హాజరయ్యారన్నారు. మధ్యాహ్నం జరిగిన ద్వితీయ సంవత్సరంలో 1,968 మంది విద్యార్థులు పరీక్షలు రాశారని, 21 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాలేదని పేర్కొన్నారు.


