News February 4, 2025
మహిళను బెదిరించి డబ్బులు వసూలు.. నిందితుడు అరెస్ట్
నగ్న వీడియోలు బయటపెడతానని నిడదవోలుకు చెందిన మహిళను బెదిరించి డబ్బులు వసూలు చేసిన కేసులో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ దేవకుమార్ తెలిపారు. మంగళవారం కొవ్వూరులో మీడియా సమావేశం నిర్వహించారు. నిందితుడు రూ.2కోట్ల 53 లక్షలు వసూలు చేశాడని చెప్పారు. బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడిని అరెస్టు చేసి రూ.కోటి 81 లక్షల విలువ గల స్థిర, చర ఆస్తులు సీజ్ చేసినట్లు తెలిపారు.
Similar News
News February 5, 2025
అసంఘటిత కార్మికుల నమోదుకు స్పెషల్ డ్రైవ్ – కలెక్టర్
అసంఘటిత రంగ కార్మికులను ఈ-శ్రమ్ పోర్టల్ నందు నమోదు చేసుకునేలా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలో అసంఘటిత రంగ కార్మికులు ఈ-శ్రమ్ పోర్టల్ నందు ఉచిత నమోదుపై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ప్రతిఒక్క కార్మికుడిని పోర్టల్లో నమోదు చేయించాలని సూచించారు.
News February 4, 2025
ఆక్రమణ భూముల క్రమబద్దీకరణ – తూ.గో కలెక్టర్
అనధికారికంగా ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములలో అభ్యంతరం లేని నివాస స్థలాలను క్రమబద్ధీకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కలెక్టర్ పీ.ప్రశాంతి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తక్షణం ఈ ఉత్తర్వులు అమలులోకి రావడం జరిగిందని తెలిపారు. ఇందుకు సంబంధించి నివాస గృహాల ద్వారా అభ్యంతరం లేని ప్రభుత్వ భూమిపై అనధికార ఆక్రమణలను గుర్తించాలని ఆదేశించారు.
News February 4, 2025
తూ.గో: ఇసుక రీచ్లలో తవ్వకాలు ప్రారంభమవ్వాలి- కలెక్టర్
తీర ప్రాంతం దాటి ఉన్న ఇసుక రీచ్ తవ్వకాలు బుధవారం నుంచి ప్రారంభించేలా సమన్వయ శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పీ ప్రశాంతి స్పష్టం చేశారు. సోమవారం రాత్రి జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో 15 ఓపెన్ సాండ్ రీచ్లలో నిర్దేశించుకున్న 10,39,350 మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఇసుకకు సంబంధించి 8,62,719 లభ్యత ఉందన్నారు.