News March 8, 2025
మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు: జనగామ కలెక్టర్

జనగామ జిల్లాలోని మహిళలకు, మహిళా ఉద్యోగులకు జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అన్ని రంగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు, హక్కులపై వారికి అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని పేర్కొన్నారు. మహిళా అభివృద్ధితోనే సమాజ అభివృద్ధి అని తెలిపారు.
Similar News
News November 1, 2025
అధికారులు అద్భుతంగా పని చేశారు: CM చంద్రబాబు

AP: మొంథా తుఫాన్ సమయంలో అధికారులు అద్భుతంగా పని చేశారని CM చంద్రబాబు ప్రశంసించారు. పెను ప్రమాదం తప్పిందని, ముందు జాగ్రత్తతో ప్రాణ, ఆస్తి నష్టం తగ్గించామని అన్నారు. తన జీవితంలో చాలా తుఫాన్లు చూశానని, ఈ సారి యంత్రాంగం, టెక్నాలజీ సాయంతో సమర్థవంతంగా ఎదుర్కొన్నామని చెప్పారు. 602 డ్రోన్లను వినియోగించి ట్రాక్ చేశామన్నారు. ఉత్తమ సేవలు అందించిన అధికారులకు సన్మాన పత్రాలు, మెమెంటోలు అందజేశారు.
News November 1, 2025
ఎన్టీఆర్: రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (దూరవిద్య) పరిధిలోని కళాశాలల్లో జులై, ఆగస్టు 2025లో నిర్వహించిన ఎం.ఏ 1,2,4వ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు నవంబర్ 4వ తేదీలోగా ఒక్కో పేపరుకు రూ. 960 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని, వివరాలకు https://anucde.info/ResultsJAug25.asp చూడాలని వర్సిటీ తెలిపింది.
News November 1, 2025
MBNR: విద్యుత్ షాక్తో డిగ్రీ విద్యార్థి మృతి

కరెంటు షాక్తో డిగ్రీ విద్యార్థి మృతి చెందిన ఘటన మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం గోప్లాపూర్లో నిన్న రాత్రి జరిగింది. కుటుంబసభ్యులు వివరాలు.. గ్రామానికి చెందిన సావిత్రి, తుల్జానాయక్కు కుమారుడు కార్తీక్, ఓ కుమార్తె ఉన్నారు. నూతనంగా నిర్మిస్తున్న ఇంటికి కార్తీక్ నీరు పడుతుండగా కరెంట్ షాక్ గురయ్యాడు. స్థానికులు గుర్తించి జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు తెలిపారు.


