News March 6, 2025

మహిళలకు రుణాలు ఇవ్వండి: అనకాపల్లి కలెక్టర్

image

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బ్యాంకర్లు స్వయం సహాయక సంఘాల మహిళలకు రుణాలు ఇవ్వాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్ సూచించారు. బ్యాంక్ అధికారులతో ఆమె మాట్లాడుతూ.. పీఎంఈజీపీ, ఎంఎస్ఎంఈ, పీఎం విశ్వకర్మ, ముద్ర లోన్స్ మంజూరు చేయాలని సూచించారు. ప్రతి పథకం కింద ఆయా బ్యాంకులు మహిళలకు రుణాలు ఇవ్వాలన్నారు.

Similar News

News March 17, 2026

GNT: రూ.10 కోట్లతో ఫైనాన్స్ యజమాని పరార్

image

లక్ష పెడితే నెలకు రూ. 10 వేల లాభమంటూ నమ్మించిన ఓ ఫైనాన్స్ సంస్థ యజమాని వందల మందికి టోకరా వేశాడు. గుంటూరు అరండల్‌పేటలో ‘ట్రేడ్ దోస్త్’ పేరుతో సంస్థ నడిపిన బాపట్లకు చెందిన వెంకట పూర్ణచంద్రరావు.. ఏజెంట్ల ద్వారా సుమారు రూ. 10 కోట్లు వసూలు చేసి పరారయ్యాడు. ఫోన్ స్విచ్ఛాఫ్ కావడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు.

News March 17, 2026

పెద్దపల్లి: రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి

image

పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మంచిర్యాలకు చెందిన దంపతులు దుర్మరణం చెందారు. లయన్స్ క్లబ్, క్రెడాయి సభ్యుడైన ఎడ్ల శ్రీనివాస్, రజిత దంపతులు హైదరాబాద్‌లో చదువుకుంటున్న కూతురు రిషిత వద్దకు వెళ్లి కారులో తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టగా దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. జంట మృతి స్థానికంగా విషాదాన్ని నింపింది.

News March 17, 2026

రేపటి నుంచే దివ్యాంగులకు ఉచిత ప్రయాణం!

image

AP: RTC బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సదుపాయం రేపటి నుంచి అందుబాటులోకి రానుంది. ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు. 40 శాతం, ఆపైన వైకల్యం ఉన్న దివ్యాంగులు సిటీ ఆర్డినరీ, మెట్రో, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఫ్రీగా వెళ్లొచ్చు. బస్సు ఎక్కేటప్పుడు PHC పాస్/వికలాంగుల కార్డు చూపించి జీరో టికెట్ తీసుకోవాలని RTC సూచించింది.