News April 4, 2025

మహిళలపై అఘాయిత్యాలు.. CM ఏంచేస్తున్నారు: RSP

image

శాంతి భద్రతలు కాపాడడంలో రేవంత్ సర్కార్ విఫలమైందని BRS నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. మేడ్చల్ MMTS రైలులో యువతిపై అత్యాచారయత్నం, సంగారెడ్డి కందిలో భర్తను కట్టేసి మహిళపై అత్యాచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ని జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. స్వయంగా సీఎం హోంమంత్రిగా ఉన్నప్పటికీ ఇన్ని అఘాయిత్యాలు జరగటం ఏంటని ప్రశ్నించారు.

Similar News

News November 5, 2025

యువతలోని ప్రతిభను ప్రదర్శించడానికి చక్కని అవకాశం: కలెక్టర్

image

యువతలోని ప్రతిభను వెలికితీయడానికి యువజనోత్సవాలు ఒక సువర్ణవకాశమని కలెక్టర్ రాజకుమారి అన్నారు. నంద్యాల రామకృష్ణ డిగ్రీ, పీజీ కళాశాల ఆడిటోరియంలో జిల్లా యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా యువజనోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో ఎంపీ బైరెడ్డి శబరితో కలిసి ఆమె పాల్గొన్నారు. విద్యార్థులు తమ నైపుణ్యాలను సమాజానికి ఉపయోగపడే విధంగా మలుచుకోవాలని ఎంపీ సూచించారు.

News November 5, 2025

గోదావరిఖని: పీజీ కళాశాల విద్యార్థులకు బంగారు పతకాలు

image

గోదావరిఖని ప్రభుత్వ పీజీ కళాశాల ఎంబీఏ విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించి బంగారు పతకాలకు ఎంపికయ్యారు. ఎంపికైన వారిలో విద్యార్థినులు దూడెం తరుణ, మునిగంటి మౌనిక, దేవులపల్లి ఉషశ్రీ, పున్నం కళ్యాణి, కందూరి కళ్యాణి, చిట్టవేణి సాగరిక ఉన్నారు. ఈనెల 7న శాతవాహన యూనివర్సిటీ నిర్వహించే ద్వితీయ స్నాతకోత్సవ వేడుకల్లో వీరు బంగారు పతకాలను అందుకోనున్నారు.

News November 5, 2025

ANU దూరవిద్య యూజీ, పీజీ పరీక్ష ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం పరిధిలో ఈ ఏడాది జూలై, ఆగస్టు మాసాలలో జరిగిన పలు యూజీ, పీజీ కోర్సుల పరీక్ష ఫలితాలను దూరవిద్య కేంద్రం డైరెక్టర్ వంకాయలపాటి వెంకటేశ్వర్లు విడుదల చేశారు. బిబిఎం, బిహెచ్ఎం, బిబిఏ, ఇయర్ ఎండ్ సప్లమెంటరీ పరీక్ష ఫలితాలతో పాటు, ఎంఏ ఇంగ్లిష్, ఎంఏ సోషల్ వర్క్, మొదటి, ద్వితీయ, తృతీయ సెమిస్టర్, తదితర ఫలితాలను విడుదల చేశారు.