News April 4, 2025

మహిళలపై అఘాయిత్యాలు.. CM ఏంచేస్తున్నారు: RSP

image

శాంతి భద్రతలు కాపాడడంలో రేవంత్ సర్కార్ విఫలమైందని BRS నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. మేడ్చల్ MMTS రైలులో యువతిపై అత్యాచారయత్నం, సంగారెడ్డి కందిలో భర్తను కట్టేసి మహిళపై అత్యాచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ని జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. స్వయంగా సీఎం హోంమంత్రిగా ఉన్నప్పటికీ ఇన్ని అఘాయిత్యాలు జరగటం ఏంటని ప్రశ్నించారు.

Similar News

News December 25, 2025

గజ గజ.. బయటికి వెళ్తే స్వెటర్లు మరవద్దు!

image

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 2 రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని IMD తెలిపింది. దీంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఉదయం, రాత్రి వేళల్లో చిన్నారులు, వృద్ధులను బయటికి తీసుకెళ్లొద్దని సూచిస్తున్నారు. తప్పనిసరి అయితే స్వెటర్లు ధరింపజేయాలని చెబుతున్నారు. చెవులు, అరచేతులు, పాదాలు వెచ్చగా ఉండేలా చూడాలంటున్నారు.

News December 25, 2025

నకిరేకల్‌లో తప్పిపోయిన సూర్యాపేట బాలిక.. చివరికి..!

image

సూర్యాపేటకు చెందిన ఓ బాలిక ఆమె తల్లితో పాటు సూర్యాపేట వెళ్తున్న క్రమంలో తల్లికి తెలియకుండా నకిరేకల్‌లో ప్రధాన కూడలి వద్ద దిగింది. చూసుకోకుండా ఆమె ఉన్న వాహనం అక్కడి నుంచి వెళ్లిపోయింది. పాప ఏడ్చుకుంటూ అక్కడే తిరుగుతుండగా అక్కడ ఉన్నవారు గమనించి నకిరేకల్ పోలీస్ స్టేషన్‌కి తీసుకురావడంతో SI వీరబాబు డీటెయిల్స్ కనుక్కొని సంబంధించిన వారికి తెలియపరచి, తల్లిదండ్రులకు అప్పగించారు.

News December 25, 2025

వేగంగా పనులు చేయండి: అన్నమయ్య కలెక్టర్

image

రహదారుల పనులు వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు ప్రయాణ ఖర్చు తగ్గేలా చూడాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. రాయచోటి కలెక్టరేట్‌లో వివిధ ఇంజినీరింగ్ శాఖల పనుల పురోగతిపై సమీక్షించారు. గ్రామీణ రహదారులను మండల, జిల్లా రహదారులకు అనుసంధానం చేయాలన్నారు. జలజీవన్ మిషన్, వాటర్ గ్రిడ్, R&B, నీటిపారుదల, జాతీయ రహదారుల పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.