News March 8, 2025

మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు: KMR కలెక్టర్

image

మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని KMR జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లో శుక్రవారం మహిళల దినోత్సవాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ..మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలను ప్రవేశపెట్టి అమలు పరచడం జరుగుతుందని చెప్పారు. ఆయా శాఖలో పనిచేస్తున్న ఉత్తమ ఉద్యోగులకు కలెక్టర్ అవార్డులు అందజేశారు.

Similar News

News March 19, 2025

సంగారెడ్డి: టెన్త్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి

image

సంగారెడ్డి జిల్లాలో ఈనెల 21 నుంచి జరిగే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. జిల్లాలో 122 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, 22,411 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని చెప్పారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా తగిన ఏర్పాట్లు చేశామన్నారు. విద్యార్థులు పరీక్షలు ప్రశాంతంగా రాయాలని సూచించారు.

News March 19, 2025

MBNR: GET READY.. టెన్త్ పరీక్షలకు సర్వం సిద్ధం

image

మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా టెన్త్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు డీఈఓ ప్రవీణ్ కుమార్ తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా నిఘా పెట్టామన్నారు. జిల్లా వ్యాప్తంగా 60 పరీక్ష కేంద్రాల్లో 12,300 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని, ఆన్‌లైన్‌లో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్ష జరుగుతుందని అన్నారు.

News March 19, 2025

జి. కొండూరు: వరుసకు కూతురితో అసభ్య ప్రవర్తన

image

కూతురు వరుసయ్యే బాలికతో వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించిన ఘటన జి. కొండూరు(M) చెవుటూరులో జరిగింది. విజయవాడకు చెందిన మహిళ భర్తతో విడిపోయింది. కొడుకు, కమార్తెతో వచ్చి రవీంద్రతో ఉంటోంది. సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆ వ్యక్తి బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. తల్లి పని నుంచి ఇంటికి రాగానే చిన్నారి జరిగిందంతా చెప్పింది. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోక్సో కేసు నమోదు చేయగా.. అవమానంతో వ్యక్తి విషం తాగాడు.

error: Content is protected !!