News February 4, 2025
మహిళలు, పిల్లల రక్షణకు ప్రాధాన్యం: ASF SP

జిల్లాలోని మహిళలు, యువతులు ఎవరైనా హింసకు గురైనట్లయితే నిర్భయంగా పోలీసులను సంప్రదించవచ్చని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ప్రకటనలో తెలిపారు. మహిళలు, చిన్నపిల్లల రక్షణ కోసం షీ టీం, యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ టీం, భరోసా సెంటర్లు పనిచేస్తున్నాయన్నారు. విద్యార్థినులు, మహిళలు అన్యాయానికి గురైనప్పుడు భయపడకుండా ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 19, 2025
శివరాత్రి వేడుకలు విజయవంతం చేయాలి: అదనపు కలెక్టర్

మహాశివరాత్రి వేడుకలను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని ములుగు అదనపు కలెక్టర్ సంపత్ రావు ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయంలో పోలీసులు, అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ఈనెల 26 నుంచి 28 వరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. భక్తుల సంఖ్య దృష్ట్యా పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలన్నారు. భక్తుల కోసం అవసరమైన పందిర్లు ఏర్పాటు చేయాలని కోరారు.
News February 19, 2025
మందస: పాఠశాల విద్యార్థిని ఆత్మహత్య

మందస మండలం లోహరిబంధలో బుధవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ బాలిక స్థానికంగా 8వ తరగతి చదువుతుంది. మధ్యాహ్నం పాఠశాలలో భోజనం అనంతరం సమీపంలోని జీడీ తోటలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హరిపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదైంది.
News February 19, 2025
‘ఉప్పు’ ముప్పును దూరం చేసే టీస్పూన్!

ఉప్పు తినడాన్ని తగ్గించాలని వైద్యులు సూచిస్తున్న వేళ జపాన్ సైంటిస్టులు ‘ఎలక్ట్రిక్ సాల్ట్ స్పూన్’ను అభివృద్ధి చేశారు. ఏదైనా ఆహారంలో ఉప్పు వేయకున్నా ఆ రుచిని ఈ స్పూన్ మీకు అందిస్తుంది. ఇది తేలికపాటి విద్యుత్ ప్రవాహాన్ని పంపించి నాలుకలో ఉండే టేస్టింగ్ గ్రంథులను ఉత్తేజపరిచి ఉప్పు రుచిని అందిస్తాయి. దీనిని వాడటం వల్ల అధిక రక్తపోటు వంటి ప్రమాదాలను నివారించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.