News December 5, 2024

మహిళల, బాలబాలికల భద్రత, రక్షణకు సమన్వయంతో పనిచేయాలి: ఎస్పీ

image

మహిళల భద్రత, రక్షణకు, బాల్యదశను ఉన్నతంగా తీర్చిదిద్దే విధంగా అన్ని శాఖలు కలిసి సమన్వయంతో పని చేయాలని కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో కర్నూలులోని వివిధ శాఖల సిబ్బందితో సమావేశం నిర్వహించి పలు సూచనలు, సలహాలు చేశారు. అనంతరం లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ కల్పించాలనే కరపత్రాలను ఆవిష్కరించారు.

Similar News

News January 25, 2026

అత్యాచార కేసుల్లో బాధిత కుటుంబాలకు ఉద్యోగాలు: కలెక్టర్

image

ఎస్సీ, ఎస్టీ అత్యాచార కేసుల్లో బాధిత కుటుంబాలైన ఏడుగురికి పీవోఏ యాక్ట్ కింద ఐటీఐ, అగ్రికల్చర్, సోషల్ వెల్ఫేర్, పబ్లిక్ హెల్త్ విభాగాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించినట్లు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి వెల్లడించారు. శనివారం కలెక్టరేట్లోని తన ఛాంబర్‌లో వారికి నియామక పత్రాలను అందజేశారు. ఉద్యోగాలు పొందిన వారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.

News January 25, 2026

రేపు ప్రజా ఫిర్యాదుల వేదిక రద్దు: కలెక్టర్

image

ఈనెల 26న (సోమవారం) కర్నూలు జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహించనున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం తాత్కాలికంగా రద్దు చేశామని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి తెలిపారు. ఆ రోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి, జిల్లా కేంద్రానికి రావొద్దని సూచించారు.

News January 25, 2026

కర్నూలు: ‘శ్మశాన వాటికకు వెళ్లాలంటే.. వాగు దాటాల్సిందే’

image

తుగ్గలిలోని దళితులకు సరియైన శ్మశాన వాటిక లేక మృతదేహంపై మరొక మృతదేహం పెడుతూ అంత్యక్రియలు చేయాల్సిన పరిస్థితి నెలకొందని కాలనీవాసులు వాపోతున్నారు. శనివారం మరియమ్మ అనే వృద్ధురాలు మృతి చెందడంతో ఆమెను అరకొరగా ఉన్న శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించేందుకు సరైన దారి లేక సుమారు మోకాళ్ల లోతుకుపైగా ఉన్న నీళ్లు ఉన్న బురదలో వెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. దళితులకు శ్మశాన వాటిక స్థలాన్ని చూపాలని కోరారు.