News June 16, 2024
మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యం: హోంమంత్రి అనిత

మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తామని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. వైసీపీ పాలనలో స్త్రీలకు రక్షణ కరువైందని, రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ వాడకం బాగా పెరిగాయన్నారు. భూకబ్జాలు, దాడులకు హద్దులేకుండా పోయిందని ఆరోపించారు. వీటన్నింటినీ తమ ప్రభుత్వంలో సరిదిద్దుతానన్నారు. ఆడపిల్లలు కిడ్నాప్కు గురికాకుండా పటిష్ఠమైన చర్యలు చేపడతామన్నారు. శాంతిభద్రతల పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామన్నారు.
Similar News
News December 11, 2025
విశాఖ జిల్లా గ్రంథాలయ ఛైర్మన్గా వన్నం రెడ్డి సతీష్ కుమార్

రాష్ట్ర ప్రభుత్వం గ్రంథాలయ ఛైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ జిల్లా గ్రంథాలయం ఛైర్మన్గా తూర్పు నియోజకవర్గానికి చెందిన జనసేన నాయకుడు వనం రెడ్డి సతీష్ కుమార్ నియమితులయ్యారు. జనసేనలో క్రియాశీలకంగా పని చేసిన సతీష్ కుమార్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో నేరుగా సంభాషిస్తూ పార్టీ బలోపేతానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు.
News December 11, 2025
మిషన్ జ్యోతిర్గమయ.. 21 మంది యాచకులకు విముక్తి

విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు ‘మిషన్ జ్యోతిర్గమయ’లో భాగంగా పోలీసులు, ఏయూటీడీ బృందం 21 మంది యాచకులను రక్షించింది. వీరిలో ఇద్దరు మహిళలు, తొమ్మిది మంది మానసిక రోగులు ఉన్నారు. ఒడిశా, బంగ్లాదేశ్, ముంబై, తదితర ప్రాంతాలకు చెందిన వీరిని భీంనగర్, టీఎస్ఆర్ కాంప్లెక్స్ షెల్టర్లకు తరలించి ఆశ్రయం కల్పించారు.
News December 11, 2025
విశాఖలో MPHA కోర్స్కు కౌన్సిలింగ్

విశాఖలో DMHO జగదీశ్వర రావు, ప్రాంతీయ శిక్షణా కేంద్రం ప్రిన్సిపల్ సుజాత ఆధ్వర్యంలో గురువారం MPHA కోర్స్కు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ కౌన్సిలింగ్లో 128 సీట్లకు గానూ 123 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులను పరిశీలించి దరఖాస్తు చేసుకున్నవారందరికీ సీట్లు లభిస్తాయని తెలిపారు. త్వరలో శిక్షణ ప్రారంభించనున్నట్లు చెప్పారు.


