News February 25, 2025
మహిళా కాంగ్రెస్ సభ్యత్వాల్లో భద్రాద్రి జిల్లాకు 4వ స్థానం

గాంధీభవన్లో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు అధ్యక్షతన జరిగిన నారి న్యాయ సమ్మేళన్ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న పాల్గొన్నారు. తెలంగాణలో లక్ష సభ్యత్వాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కలాంబ హాజరయ్యారన్నారు. మహిళా కాంగ్రెస్ సభ్యత్వాల్లో జిల్లాకు 4వ స్థానం దక్కిందన్నారు.
Similar News
News February 25, 2025
కొడంగల్: సీఎం రేవంత్ సెంటిమెంట్ ఆలయం ఇదే.!

కొడంగల్ పట్టణంలోని శ్రీ గాడిబావి శివాలయం అంటే సీఎం రేవంత్ రెడ్డి సెంటిమెంటుగా భావిస్తారు. 300 ఏండ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయంలోని శివలింగం అతిపెద్ద పాణివాటం, బ్రహ్మసూత్రం కలిగి ఉంటుంది. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి ఇక్కడే నామినేషన్ పత్రాలకు పూజలు చేసి, నామినేషన్ వేశారు. భారీ మెజారిటీతో విజయం సాధించి.. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు.
News February 25, 2025
ఉద్యోగాల కల్పనపై శాసనమండలిలో గందరగోళం

AP: బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్తో అబద్ధాలు చెప్పించారని YCP MLC వరుదు కళ్యాణి విమర్శించారు. దీంతో అధికార పార్టీ నేతలు మండిపడ్డారు. 4లక్షల ఉద్యోగాలు కల్పించామని ప్రభుత్వం చెప్పినట్లు ఆమె మాట్లాడగా.. మంత్రి లోకేశ్ జోక్యం చేసుకున్నారు. 4లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యం అని చెప్పామని, కల్పించామని చెప్పలేదన్నారు. YCP సభ్యులు వాస్తవాలు మాట్లాడాలని, వాకౌట్ చేయకుండా కూర్చుంటే చర్చిద్దాం అని తెలిపారు.
News February 25, 2025
NTR : MLC ఎన్నికలు.. పరీక్షలు వాయిదా

ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ MLC ఎన్నికలు ఈ నెల 27న ఉన్నందున ఆ రోజు జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశామని కృష్ణా యూనివర్సిటీ తెలిపింది. ఈ మేరకు కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలలో 27న జరగాల్సిన ఎంటెక్ ఒకటో సెమిస్టర్ రెగ్యులర్ & సప్లిమెంటరీ పరీక్షలను మార్చి 3వ తేదికి వాయిదా వేశామని కృష్ణా యూనివర్సిటీ పరీక్షల విభాగం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది.